టీజీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు అవకాశం
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ తెలుసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇక్కడ చూడండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విడుదల చేసింది.
సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు tgbie.cgg.gov.in తో పాటు results.cgg.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
- అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో 'TS Inter Supplementary Result 2025 for 1st or 2nd year' అని ఉన్న లింక్పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- మీ ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
- టీజీ ఐపీఏఎస్ఈ (TG IPASE) ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
ఉత్తీర్ణత వివరాలు
మే 22 నుండి మే 29, 2025 వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు (మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, జనరల్, ఒకేషనల్ కలిపి) రాష్ట్రంలోని 892 పరీక్షా కేంద్రాల్లో హాజరయ్యారు. పరీక్షల అనంతరం, 14 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సమాధాన పత్రాలను దిద్దగా, జూన్ 3 నుండి 6 వరకు 33 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి.
మొదటి సంవత్సరం ఫలితాలు ఇలా
మొదటి సంవత్సరంలో మొత్తం 1,79,531 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది 67.4% ఉత్తీర్ణత శాతాన్ని సూచిస్తుంది. ఇందులో బాలికలు అబ్బాయిల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. 73.92% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 61.89%గా నమోదైంది. 'ఏ' గ్రేడ్లో (75% అంతకంటే ఎక్కువ మార్కులు) 92,574 మంది విద్యార్థులు ఉండటం విశేషం.
రెండో సంవత్సరం ఫలితాలు:
రెండో సంవత్సరంలో మొత్తం 76,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీని ద్వారా 51.7% ఉత్తీర్ణత నమోదైంది. ఇక్కడ కూడా బాలికలే పైచేయి సాధించారు. 54.89% మంది బాలికలు పాస్ అవ్వగా, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 49.8%గా ఉంది.
జిల్లాల వారీగా:
జిల్లా స్థాయి ఫలితాలను పరిశీలిస్తే, జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా రెండో సంవత్సరంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని (88.64%) సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ములుగు (84.23%), మహబూబాబాద్ (76.69%) జిల్లాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట వంటి జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది.
గత మూడేళ్ల పోలిక:
గత మూడేళ్ల ఫలితాలను గమనిస్తే, జనరల్ విభాగంలో మొదటి సంవత్సరంలో 2025లో 67.4% పాస్ పర్సంటేజ్ ఉండగా, 2024లో 63.86%, 2023లో 62.58% నమోదైంది. ఇది మొదటి సంవత్సరంలో మెరుగుదలను సూచిస్తుంది. రెండో సంవత్సరంలో 2025లో 50.82% ఉండగా, 2024లో 43.77%, 2023లో 46.06% ఉంది. రెండో సంవత్సరంలో కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి.
షార్ట్ మెమో
విద్యార్థులు తమ ఫలితాలను https://tgbie.cgg.gov.in మరియు https://results.cgg.gov.in వెబ్సైట్ల ద్వారా చూసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఆన్లైన్లో 'షార్ట్ మెమో' (మెమోరాండం ఆఫ్ మార్క్స్) డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవాలని బోర్డు సూచించింది.
విద్యార్థులకు సహాయకారిగా:
పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2500 జూనియర్ కళాశాలల్లో విద్యార్థి కౌన్సెలర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, టెలి-మానస్ (Tele-MANAS) ద్వారా 24 గంటల ఉచిత టోల్-ఫ్రీ నంబర్ 14416 ద్వారా మానసిక ఆరోగ్య సహాయం కూడా అందుబాటులో ఉంది.
రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ అవకాశం:
తమ మార్కులపై ఏమైనా సందేహాలు ఉన్న విద్యార్థులు వారం రోజులలోపు (జూన్ 17 నుండి జూన్ 23, 2025 వరకు) రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ-కమ్-రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు పేపర్కి రూ.100, స్కాన్ చేసిన కాపీ-కమ్-రీవెరిఫికేషన్కు పేపర్కి రూ.600 చెల్లించాలి.

E-Paper












