Upcoming SUVs : ఇండియాలో ఎస్యూవీల జాతర! లాంచ్కు రెడీ అవుతున్న మోడల్స్ ఇవే..
కియా, వోక్స్వ్యాగన్, రెనాల్ట్, మహీంద్రా, మారుతీ సుజుకీ, టాటా మెటార్స్ నుంచి రానున్న నెలల్లో అదిరే ఎస్యూవీలు లాంచ్కానున్నాయి. వీటిల్లో కొన్ని ఫేస్లిఫ్ట్ వర్షెన్లు ఉండగా మరికొన్ని కొత్త మోడల్స్ వస్తున్నాయి. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న సబ్-4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి రాబోయే నెలల్లో సరికొత్త మోడళ్లు రానున్నాయి. పూర్తిగా కొత్త డిజైన్లు, నెక్ట్స్-జెన్ అప్గ్రేడ్లు, ఫేస్లిఫ్ట్ వెర్షన్లతో ఆటో రంగం కళకళలాడనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోయే టాప్-6 మోడళ్ల జాబితా ఇక్కడ చూద్దాము.

1. నెక్ట్స్-జెన్ కియా సోనెట్..
కియా మోటార్స్ తన పాపులర్ ఎస్యూవీ 'సోనెట్' సెకండ్ జనరేషన్ వెర్షన్ రోడ్ టెస్టింగ్ను భారత్లో ప్రారంభించింది. 2027 మొదటి అర్ధభాగంలో, మోస్ట్ లైక్లీ 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సమయంలో ఇది లాంచ్ కానుంది. ప్రస్తుత మోడల్తో పోలిస్తే కొత్త సోనెట్ మరింత వెడల్పుగా, విశాలమైన క్యాబిన్తో రానుంది. ఇది హ్యుందాయ్ వెన్యూ, కియా సైరోస్ వాడే కొత్త కే1 ప్లాట్ఫారమ్పై రూపుదిద్దుకుంటోంది. ట్రిపుల్/ట్విన్ 12.3-అంగుళాల కర్వ్డ్ డిస్ప్లేలు, మెరుగైన లెవెల్-2 అడాస్ ఫీచర్లతో పాటు పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభించనుంది. అంతేకాకుండా 2028-29 నాటికి ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ కూడా రానున్నట్లు కియా ధృవీకరించింది.
2. వోక్స్వ్యాగన్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ..
సబ్-4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి అధికారికంగా ప్రవేశిస్తున్నట్లు వోక్స్వ్యాగన్ ప్రకటించింది. ఇది స్కోడా కైలాక్ రీ-బాడ్జ్డ్ వెర్షన్ అయినప్పటికీ, వోక్స్వ్యాగన్ దీనికి తగినట్టుగా ప్రత్యేకమైన ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు చేయనుంది. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన స్థానిక MQB-A0-IN ప్లాట్ఫారమ్పై తయారవుతుంది. 115 పవర్ని ఇచ్చే 1.0-లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్తో పాటు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లో ఇది మార్కెట్లోకి రానుంది.
3. రెనాల్ట్ బ్రిడ్జర్..
రెనాల్ట్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్యూవీ 2027 మొదటి అర్ధభాగంలో భారత్లో విడుదల కానుంది. ప్రసిద్ధ రెనాల్ట్ డస్టర్ ఆధారిత RGMP ప్లాట్ఫారమ్పై ఇది రూపుదిద్దుకుంటోంది. రగ్డ్, బాక్సీ డిజైన్, టెయిల్గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్తో లైఫ్స్టైల్ ఎస్యూవీగా దీన్ని మార్కెట్ చేయనున్నారు. కొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి.
4. మహీంద్రా విజన్ ఎస్..
మహీంద్రా తన సరికొత్త NU_IQ మాడ్యులర్ ప్లాట్ఫారమ్ను పరిచయం చేస్తూ 'విజన్ ఎస్' కాన్సెప్ట్ ఆధారిత ఎస్యూవీని తీసుకొస్తోంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో దీని ప్రొడక్షన్ వెర్షన్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. స్కార్పియో ఫ్యామిలీలోనే అత్యంత చిన్న సభ్యుడిగా వస్తున్న ఈ బాక్సీ ఎస్యూవీలో పనోరమిక్ సన్రూఫ్, ఐసీఈ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఆప్షన్లు లభించనున్నాయి.
5. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్..
మారుతీ సుజుకీ తన విజయవంతమైన క్రాస్ఓవర్ 'ఫ్రాంక్స్' మోడల్కు 2027 మార్చి నాటికి మిడ్-లైఫ్ అప్డేట్ ఇవ్వనుంది. డిజైన్ పరంగా, ఇంటీరియర్లో మార్పులతో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో చేరనున్నాయి. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, చిన్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్తో కూడిన సుజుకీ కొత్త సిరీస్ హైబ్రిడ్ ఇంజన్ రానుంది. ఇది లీటరుకు 35 కి.మీ పైగా ఇంధన సామర్థ్యాన్ని (మైలేజీ) అందించే అవకాశం ఉంది.
6. నెక్ట్స్-జెన్ టాటా నెక్సాన్..
భారత మార్కెట్లో తిరుగులేని క్రేజ్ ఉన్న టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ నెక్ట్స్-జెన్ మోడల్ 2027 నాటికి లాంచ్ కానుంది. ప్రస్తుత ప్లాట్ఫారమ్ను మరింత అధునాతనంగా మార్పులు చేసి దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త డిజైన్ లాంగ్వేజ్, అప్డేటెడ్ ఇంటీరియర్ లేఅవుట్తో పాటు మరింత మెరుగైన ఈవీ, ఐసీఈ ఆప్షన్లలో ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


