ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి టయోటా ఎంట్రీ: రేపే 'అర్బన్ క్రూయిజర్ ఈవీ' లాంచ్
టయోటా తన తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'అర్బన్ క్రూయిజర్ ఈవీ'ని జనవరి 20న (రేపు) విడుదల చేయనుంది. సింగిల్ ఛార్జ్పై 543 కిమీల మైలేజీ, అత్యాధునిక ఏడీఏఎస్ (ADAS) భద్రతా ఫీచర్లతో వస్తున్న ఈ కారుపై భారీ అంచనాలు ఉన్నాయి.
భారతదేశంలో హైబ్రిడ్ కార్లతో (ఇన్నోవా హైక్రాస్, హైరైడర్) సంచలనం సృష్టిస్తున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం 'టయోటా', ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'అర్బన్ క్రూయిజర్ ఈవీ'ని జనవరి 20న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు లాంచ్తో హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి సుజుకి ఈ-విటారా వంటి కార్లకు టయోటా గట్టి పోటీ ఇవ్వనుంది.

డిజైన్: అదిరిపోయే లుక్స్
ఇటీవల విడుదలైన టీజర్ వీడియోను బట్టి చూస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ టయోటా ప్రసిద్ధ మోడల్ 'కామ్రీ' (Camry) నుండి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ డిజైన్, సింగిల్-స్ట్రిప్ డీఆర్ఎల్స్తో కూడిన ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్లైట్లు కారుకు ప్రీమియం లుక్ను ఇస్తున్నాయి. మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్ఫామ్ ఆధారంగానే దీన్ని రూపొందించినప్పటికీ, టయోటా తనదైన శైలిలో డైమండ్-కట్ అలాయ్ వీల్స్, రగ్గడ్ బాడీ క్లాడింగ్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ టెయిల్ లైట్లను జోడించింది.
బ్యాటరీ, రేంజ్: ఒక్క ఛార్జ్తో లాంగ్ డ్రైవ్
టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభించనుంది:
49 kWh బ్యాటరీ: ఇది 144 హార్స్ పవర్ (HP) శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
61 kWh బ్యాటరీ: ఇది 174 హార్స్ పవర్ ఉత్పత్తి చేయడంతో పాటు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది.
ఇంటీరియర్, ఫీచర్లు
కారు లోపల విలాసవంతమైన అనుభూతిని ఇచ్చేలా అనేక ఆధునిక హంగులను జోడించారు. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్తో పాటు ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పవర్డ్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలు ఉన్నాయి. స్టోరేజ్ కోసం ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ను కూడా ఏర్పాటు చేశారు.
భద్రతకు పెద్ద పీట
భారతీయ వినియోగదారులు ప్రస్తుతం భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, టయోటా ఈ కారులో రాజీ పడకుండా ఫీచర్లను అందించింది.
- 7 ఎయిర్బ్యాగ్లు, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్.
- లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS): ఇది డ్రైవింగ్లో ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్ను అలర్ట్ చేస్తుంది.
- బిఎన్సిఏపి (BNCAP) రేటింగ్: దీని భాగస్వామ్య మోడల్ ఈ-విటారా లాగే, ఇది కూడా సేఫ్టీ రేటింగ్లో 5-స్టార్ సాధిస్తుందని అంచనా.
వీటితో పాటు ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉండనున్నాయి.
మొత్తానికి, టయోటా బ్రాండ్ వాల్యూ, నమ్మకమైన సర్వీస్తో వస్తున్న ఈ 'అర్బన్ క్రూయిజర్ ఈవీ' ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


