తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది! టెంకాసి జిల్లాలోని ఇడైకల్ కామరాజపురం వద్ద సోమవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళుతున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి పరుగులు తీసిన స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్రేన్ సాయంతో వాటిని పక్కకు తొలగించాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం!
మదురై నుంచి శెంకోట్టై వైపు వెళుతున్న కైసర్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
“కైసర్ బస్సు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు,” అని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}“కైసర్ బస్సు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు,” అని అధికారులు వెల్లడించారు.
{{/usCountry}}గాయపడిన 28 మంది ప్రయాణికులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఘటనాస్థలంలో ఉన్న అధికారులు తెలిపారు.
పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు.