కెనడాలో ఉంటున్న భారతీయులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భారతీయులు వేర్వేరు ఘటనల్లో హత్యకు గురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. టొరంటో పోలీసులు ఈ రెండు మరణాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, వరుస హత్యలు అక్కడి ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి.
యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో పీహెచ్డీ విద్యార్థి కాల్చివేత

తాజా ఘటనలో, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ సమీపంలో శివాంక్ అవస్థి అనే భారతీయ పీహెచ్డీ విద్యార్థి దుండగుల కాల్పులకు బలయ్యారు. హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ షూటౌట్ జరిగింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివాంక్ తీవ్ర రక్తస్రావంతో మరణించారని టొరంటో సన్ పత్రిక వెల్లడించింది.
పోలీసులు వచ్చే లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు కోసం క్యాంపస్ను కొంతసేపు లాక్డౌన్ చేయాల్సి వచ్చింది. టొరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. శివాంక్ మృతి పట్ల టొరంటోలోని భారత రాయబార కార్యాలయం (Consulate General) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుని కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
నివాసంలోనే విగతజీవిగా కనిపించిన డిజిటల్ క్రియేటర్
మరో విషాదకర ఘటనలో, హిమాన్షి ఖురానా (30) అనే భారతీయ యువతి టొరంటోలో దారుణ హత్యకు గురయ్యారు. హిమాన్షి సోషల్ మీడియాలో డిజిటల్ క్రియేటర్గా సుపరిచితురాలు. ఆమె అదృశ్యమైందని డిసెంబర్ 19వ తేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. గాలింపు చేపట్టిన అధికారులకు, మరుసటి రోజు ఉదయం (డిసెంబర్ 20) ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది.
ఈ కేసులో పోలీసులు అబ్దుల్ గఫూరీ (32) అనే వ్యక్తిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి, సెర్చ్ వారెంట్ జారీ చేశారు. బాధితురాలికి, నిందితుడికి మధ్య ముందే పరిచయం ఉందని, ఈ హత్యకు 'ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్' (సన్నిహితుల మధ్య ఉండే గొడవలు) కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
భద్రతపై పెరుగుతున్న ఆందోళన
{{/usCountry}}ఈ కేసులో పోలీసులు అబ్దుల్ గఫూరీ (32) అనే వ్యక్తిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి, సెర్చ్ వారెంట్ జారీ చేశారు. బాధితురాలికి, నిందితుడికి మధ్య ముందే పరిచయం ఉందని, ఈ హత్యకు 'ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్' (సన్నిహితుల మధ్య ఉండే గొడవలు) కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
భద్రతపై పెరుగుతున్న ఆందోళన
{{/usCountry}}ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును వెతుక్కుందామని కెనడా వెళ్లిన విద్యార్థులు ఇలా శవమై తిరిగి రావడం కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు కెనడాలో భారతీయుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రవాస సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.