అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం వలసదారులపై కఠిన చర్యలను మరింత వేగవంతం చేసింది. దేశంలో నివసిస్తున్న విదేశీయులపై డేగకన్ను ఉంచిన ప్రభుత్వం, ఇప్పటివరకు 1,75,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది.
వీసాల రద్దుకు ప్రధాన కారణాలేంటి?

విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించడం, చట్టవ్యతిరేక నేరాలకు పాల్పడటం, అమెరికన్ పౌరులపై హింసను ప్రేరేపించడం, మోసాలకు పాల్పడటం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం వంటి కారణాలతోనే ఈ వీసాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలు (Law Enforcement) చేపట్టిన తనిఖీల్లోనే అత్యధిక శాతం వీసా రద్దులు చోటు చేసుకున్నాయి. భౌతిక దాడులు, మద్యం సేవించి వాహనాలు నడపడం (DUI), దొంగతనాలు, డ్రగ్స్ సంబంధిత నేరాలే వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
తీవ్రమైన నేరాలు.. ‘బర్త్ టూరిజం’పై వేటు
విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని తీవ్రమైన కేసుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.
- అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న విదేశీయుల వీసాలను వెంటనే రద్దు చేశారు.
- కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్ కలిగిన కేసుల్లో ఉన్నవారి వీసాలను తొలగించారు.
- కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం అందించాలనే ఉద్దేశంతో 'బర్త్ టూరిజం' ద్వారా అమెరికా వచ్చిన ఉత్తర ఆఫ్రికాకు చెందిన 100 మందికి పైగా తల్లిదండ్రుల వీసాలను అక్కడి యూఎస్ ఎంబసీ రద్దు చేసింది.
- కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యను సోషల్ మీడియాలో వేడుకగా జరుపుకున్న పలువురు విదేశీయుల వీసాలను కూడా విదేశాంగ శాఖ తొలగించింది.
పెరిగిన తనిఖీలు.. మానవ హక్కుల సంఘాల ఆందోళన
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విభాగం తనిఖీలను తీవ్రం చేసింది. జనవరి నాటికే రికార్డు స్థాయిలో లక్షకు పైగా వీసాలను రద్దు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 1.75 లక్షలు దాటింది. చెల్లుబాటయ్యే వీసాలు ఉన్నప్పటికీ నిబంధనలు దాటిన వేలాది మందిని అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్నారు.
{{/usCountry}}ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విభాగం తనిఖీలను తీవ్రం చేసింది. జనవరి నాటికే రికార్డు స్థాయిలో లక్షకు పైగా వీసాలను రద్దు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 1.75 లక్షలు దాటింది. చెల్లుబాటయ్యే వీసాలు ఉన్నప్పటికీ నిబంధనలు దాటిన వేలాది మందిని అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్నారు.
{{/usCountry}}కొత్త వీసాల జారీ ప్రక్రియలో సోషల్ మీడియా ఖాతాల తనిఖీలను కూడా అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కఠిన సోషల్ మీడియా స్క్రీనింగ్ విధానంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీయడంతో పాటు వలసదారులపై నిఘా పెట్టడమేనని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.