'ట్రంప్' సుంకాలకు బ్రేక్..! అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, టారిఫ్లు కొట్టివేత
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలకు బ్రేక్ పడింది. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు… ట్రంప్ సుంకాలను కొట్టివేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ తగిలింది.అంతర్జాతీయ సుంకాలపై ఇచ్చిన ఆదేశాలను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితులలో ఉపయోగించడానికి ఉద్దేశించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ కీలక తీర్పును వెలువరించింది.

పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు… చట్టవిరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టివేసింది.
రిపబ్లికన్ అధ్యక్షుడి తీరు 1977 చట్ట (ఐఈఈపీఏ- ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) అధికార పరిధిని మించిపోయిందని పేర్కొంది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని నొక్కి చెప్పింది.
ట్రంప్ సుంకాలపై అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘమైన విచారణ చేపట్టింది. ధర్మాసనంలోని ఆరుగురు జడ్జిలు ఈ సుంకాలను వ్యతిరేకించగా… ముగ్గురు న్యాయమూర్తులు మాత్రం సముర్థించారు.
అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన ఈ చట్టాన్ని ఉపయోగించి ట్రంప్… ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై టారిఫ్ లు విధించారు. 6 - 3 మెజారిటీతో సుప్రీం కోర్టు ఈ టారిఫ్ లను రద్దు చేసింది.
ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో…. అక్కడి స్టాక్ మార్కెట్లలో జోష్ నింపింది. తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే సూచీలు లాభాల దిశగా వెళ్లాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

