చాట్​జీపీటీకి దేశీయ ప్రత్యామ్నాయం ఇది- కైవెక్స్​తో భారత టెక్నాలజీ రంగంలో కొత్త శకం!

భారత టెక్నాలజీ రంగంలో కొత్త శకం! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్ ఇంజిన్ 'కైవెక్స్​ని' ఆవిష్కరించారు బిలియనీర్ ఫౌండర్​ పర్ల్ కపూర్. ఇది చాట్​జీపీటీకి దేశీయ ప్రత్యామ్నాయంగా మారుతుందని అంచనాలు మొదలయ్యాయి.

Published on: Nov 15, 2025, 08:15:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ టెక్నాలజీ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది! బిలియనీర్, దార్శనికుడైన వ్యవస్థాపకుడు పర్ల్ కపూర్ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సొల్యూషన్ ఇంజిన్ ‘Kyvex’ (కైవెక్స్) మార్కెట్‌లోకి ప్రవేశించింది. వినియోగదారులు తమ జ్ఞానాన్ని పొందే విధానంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు వీలుగా, తెలివైన, ఖచ్చితమైన, పరిశోధన ఆధారిత సమాచారాన్ని అందించడమే 'కైవెక్స్​' ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఇది ఒక ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.

చాట్​జీపీటీకి దేశీయ ప్రత్యామ్నాయం ఇది..
చాట్​జీపీటీకి దేశీయ ప్రత్యామ్నాయం ఇది..

కేవలం ఛాట్‌బాట్ కాదు: కైవెక్స్​ ప్రత్యేకతలు..

సాధారణ ఛాట్‌బాట్‌లతో పోలిస్తే, 'కైవెక్స్​' మరింత లోతైన సందర్భోచిత జ్ఞానాన్ని, పరిశోధనా సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది తన సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను (ఎల్​ఎల్​ఎం) ఉపయోగించి ఖచ్చితమైన, నమ్మదగిన, పారదర్శకమైన ప్రతిస్పందనలను అందిస్తుంది. తద్వారా మానవ ఆసక్తికి, కృత్రిమ మేధకు మధ్య ఉన్న అంతరాన్ని పూరిస్తుంది.

దీనిని పూర్తిగా భారతదేశంలో తయారు చేయడం జరిగింది. భారతీయ ఇంజనీరింగ్, అకాడమిక్ నైపుణ్యం, ప్రపంచ ఆవిష్కరణల సమ్మేళనంగా 'కైవెక్స్​' నిలవడం విశేషం.

కైవెక్స్​- ప్రముఖ విద్యావేత్తల మద్దతు..

ఐఐటి దిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ రావు, ఐఐటి ఖరగ్‌పూర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి వంటి ప్రముఖ విద్యావేత్తలు ఈ కైవెక్స్​ ప్లాట్​ఫామ్​కి మద్దతు ఇస్తున్నారు. ఇది అత్యాధునిక పరిశోధన భారతీయ సాంకేతిక నైపుణ్యంపై 'కైవెక్స్​' పటిష్టంగా ఆధారపడిందని నిరూపిస్తుంది.

కైవెక్స్​- భవిష్యత్తు ప్రణాళికలు.

'కైవెక్స్​' ప్రస్తుతం వెబ్-ఆధారిత ఉత్పత్తిగా అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే, దీనిని బ్రౌజర్ అప్లికేషన్‌లలో అనుసంధానించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులకు ఈ శక్తివంతమైన ఏఐ సేవలను అందించనున్నారు.

వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన పర్ల్ కపూర్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంటెలిజెంట్​ రీసెర్చ్​, సమాచార ఆవిష్కరణలకు 'కైవెక్స్​' భవిష్యత్తు అని పేర్కొన్నారు.

"ఈ వేదిక ద్వారా భారతదేశాన్ని ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తున్నాం. ఇది అందరికీ ఉచితంగా, స్వేచ్ఛగా అందుబాటులో ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో కొత్త ఒరవడి

భారతదేశంలో ఏఐ, డీప్ టెక్ రంగంలో నాయకత్వం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో 'కైవెక్స్​' ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పవచ్చు.

పరిశోధన-నాణ్యత గల సమాధానాలు, పారదర్శకత, యాక్సెసబులిటీ కారణంగా, 'కైవెక్స్​' ప్రపంచంలోనే తెలివైన సమాచార వ్యవస్థల నాయకుడిగా మారే అవకాశం ఉంది.

"మేడ్ ఇన్ ఇండియా, బై ది వరల్డ్" అనే నినాదంతో, ఈ సాంకేతికత 100 శాతం భారతీయ ఇంజనీర్లు, పరిశోధకులచే తయారైంది.

ప్రపంచ ఏఐ ఆవిష్కరణలలో భారతదేశ ప్రాతినిధ్యాన్ని సులభతరం చేయడానికి, ఉత్తమ ఐఐటీ మేధావుల మద్దతు 'కైవెక్స్​' కు ఉంది.

ఓపెన్ సోర్స్ విధానం ద్వారా, పరిశోధన, వ్యాపారం, విద్య రంగాలలో అత్యాధునిక ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఈ ప్రయత్నానికి ఐఐటి దిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ రావు, ఐఐటి ఖరగ్‌పూర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి, ఐఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణన్ వంటి దేశంలోని పలువురు అగ్రశ్రేణి విద్యావేత్తల నుంచి మద్దతు లభించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More