భారతదేశంలో స్పోర్ట్స్ బైక్స్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్న యామహా సంస్థ మరో పవర్ఫుల్ మోడల్తో సందడి చేసేందుకు సిద్ధమైంది. దేశీయ విపణిలోకి సరికొత్త ‘యామహా ఆర్2’ బైక్ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఆర్3, ఎంటీ-03 వంటి 321సీసీ బైకుల విక్రయాలు తగ్గిపోవడం, దిగుమతి సుంకాలు పెరగడంతో వాటిని గతంలో నిలిపివేసిన యామహా, ఇప్పుడు భారతీయ యువత బడ్జెట్, వేగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 204సీసీ బైక్ను రూపుదిద్దింది.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఆర్15 బైక్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్15 కంటే ఎక్కువ పవర్, 300సీసీ కంటే అందుబాటు ధరలో వాహనాన్ని కోరుకునే యువ రైడర్లకు ఈ ఆర్2 ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
యమహా ఆర్2లో మూడు వేరియంట్లు.. విభిన్న ధరలు
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యమహా ఆర్2ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు.
స్టాండర్డ్ ఆర్2 : రూ. 2.30 లక్షలు
ఆర్2 విత్ క్విక్షిఫ్టర్ : రూ. 2.39 లక్షలు
ఆర్2ఎమ్ (స్పోర్టీ వేరియంట్): రూ. 2.53 లక్షలు
శక్తివంతమైన ఇంజిన్.. రైడింగ్ మోడ్లు
ఈ యమహా ఆర్2 బైక్లో 204సీసీ, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్, 4-వాల్వ్, డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. ఇది 10,000 ఆర్పీఎం వద్ద 26.14 బీహెచ్పీ పవర్, 8,000 ఆర్పీఎం వద్ద 19.1 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
రైడర్ల భద్రత, నియంత్రణ కోసం 'యామహా రైడింగ్ కంట్రోల్' సాంకేతికతను అందించారు. ఇందులో స్ట్రీట్, స్పోర్ట్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. రైడర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా త్రోటల్ రెస్పాన్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), క్విక్ షిఫ్ట్ సిస్టమ్ (క్యూఎస్ఎస్)లను అడ్జస్ట్ చేసుకుని సొంతంగా కస్టమ్ రైడింగ్ మోడ్ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
యమహా ఆర్2లో లైట్ వెయిట్ ఛాసిస్, రేసింగ్ డిజైన్..
చూడటానికి ఇది ఆర్15 రూపంలోనే కనిపించినప్పటికీ, ఛాసిస్ నిష్పత్తిలో పూర్తి మార్పులు చేశారు. హై-టెన్సైల్ స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్, మోటోజీపీ స్ఫూర్తితో తయారు చేసిన అల్యూమినియం డై-కాస్ట్ రియర్ ఆర్మ్ను వాడారు. ఆర్15 బైక్తో పోలిస్తే ఈ కొత్త ఛాసిస్ 2.8 కిలోల బరువు తక్కువగా ఉండటం విశేషం. ఇంజిన్ రక్షణ కోసం ఫోర్-పాయింట్ పీవట్ మౌంటెడ్ స్ట్రక్చర్ అందించారు. బైక్ మొత్తం బరువు 149 కిలోలుగా ఉంది.
{{/usCountry}}చూడటానికి ఇది ఆర్15 రూపంలోనే కనిపించినప్పటికీ, ఛాసిస్ నిష్పత్తిలో పూర్తి మార్పులు చేశారు. హై-టెన్సైల్ స్టీల్ ట్యూబ్ డైమండ్ ఫ్రేమ్, మోటోజీపీ స్ఫూర్తితో తయారు చేసిన అల్యూమినియం డై-కాస్ట్ రియర్ ఆర్మ్ను వాడారు. ఆర్15 బైక్తో పోలిస్తే ఈ కొత్త ఛాసిస్ 2.8 కిలోల బరువు తక్కువగా ఉండటం విశేషం. ఇంజిన్ రక్షణ కోసం ఫోర్-పాయింట్ పీవట్ మౌంటెడ్ స్ట్రక్చర్ అందించారు. బైక్ మొత్తం బరువు 149 కిలోలుగా ఉంది.
{{/usCountry}}ఈ బైక్ డార్క్ బ్లూయిష్ గ్రే, మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, మ్యాట్ వైట్ పెర్ల్, మెటాలిక్ గ్రే అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
యమహా ఆర్2- అధునాతన ఫీచర్లు, బుకింగ్స్ షురూ..
ఈ బైక్లో 5-ఇంచుల ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, వై-కనెక్ట్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ కీ సిస్టమ్, ఎల్ఈడీ పొజిషన్ లైట్లు, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, 282 ఎంఎం రాడియల్-మౌంటెడ్ 4-పాట్ కాలిపర్ డిస్క్ బ్రేక్, 810 ఎంఎం సీట్ హైట్, 1,340 ఎంఎం వీల్బేస్ దీని సొంతం.
భారత్లోని తన 'బ్లూ స్క్వేర్' షోరూమ్ల సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి 600 దాటించాలని యామహా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమవగా, సెప్టెంబర్ మధ్య వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.