...
...
Next Story

ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణ భయాలు

నేటి బిజీ, హడావిడి ప్రపంచంలో సరైన జీవనశైలి లేక, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న వయస్సులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. చాలా మంది వివాహిత జంటలు సంతానం పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Published on: Jul 5, 2026, 18:58:08 IST
Advertisement
<p>సంతానలేమి సమస్య పెరుగుతున్నందున చాలా మంది దంపతులు సంతాన సాఫల్య చికిత్సలను కోరుకుంటున్నారు. కానీ అంతకుముందు మహిళల్లో అనేక భయాలు, గందరగోళాలు తలెత్తుతాయి. ఈ భయాలలో చాలా వరకు తప్పుడు సమాచారం, ఒత్తిడి కారణంగానే తలెత్తుతాయి. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణంగా కొన్ని భయాలు ఉన్నాయి.</p>

సంతానలేమి సమస్య పెరుగుతున్నందున చాలా మంది దంపతులు సంతాన సాఫల్య చికిత్సలను కోరుకుంటున్నారు. కానీ అంతకుముందు మహిళల్లో అనేక భయాలు, గందరగోళాలు తలెత్తుతాయి. ఈ భయాలలో చాలా వరకు తప్పుడు సమాచారం, ఒత్తిడి కారణంగానే తలెత్తుతాయి. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ గురించి మహిళలకు ఉండే సాధారణంగా కొన్ని భయాలు ఉన్నాయి.

మొదటి భయం ఏంటంటే.. సంతానోత్పత్తి చికిత్సలు చాలా ప్రమాదకరమైనవి లేదా బాధాకరమైనవి. నిజానికి, చాలా చికిత్సలను (అండోత్పత్తి మాత్రలు, ఇంజెక్షన్లు, ఐయూఐ) సులభంగా పర్యవేక్షించవచ్చు, నిర్వహించవచ్చు. ఆధునిక మత్తుమందులను ఉపయోగించడం వల్ల ఐవీఎఫ్ వంటి చికిత్సలు కూడా తక్కువ బాధాకరంగా ఉంటాయి.

రెండో భయం ఏంటంటే.. మందులు శరీరానికి హాని చేస్తాయి. వాస్తవానికి ఈ మందులను నియంత్రిత మోతాదులో ఇస్తారు కాబట్టి ఇవి సాధారణంగా సురక్షితమైనవి. కొన్నిసార్లు స్వల్ప దుష్ప్రభావాలు ఉండవచ్చు, కానీ అవి తాత్కాలికమైనవి.

మూడో భయం ఏమిటంటే.. చికిత్స విఫలమవుతుంది. ఇది నిజం కాదు.. వయస్సు, అండం, శుక్రకణాల నాణ్యత, గర్భాశయ పరిస్థితి మొదలైన వాటిపై సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది సహజంగా గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి చికిత్స అవసరం కావచ్చు.

సహజ గర్భధారణకు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజూ సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, పప్పులు, మంచి ప్రోటీన్ తీసుకోవాలి. అధిక నూనె, జంక్ ఫుడ్, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. రోజువారీ నడక, యోగా, ఒత్తిడి నిర్వహణ హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. తగినంత నిద్రపోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం కూడా సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe