...
...
Next Story

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ - ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం

Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇవాళ పట్టువస్త్రాల సమర్పణతో పాటు పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, మ్యూజియంలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Published on: Sep 15, 2026, 06:57:25 IST
Advertisement
<p>కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సంబరం అధికారికంగా మొదలైంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహోత్సవాలకు సోమవారం సాయంత్రం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు.</p><p> </p>

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సంబరం అధికారికంగా మొదలైంది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహోత్సవాలకు సోమవారం సాయంత్రం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు.

శ్రీవారి సర్వసేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవంగా వేంచేసి, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతూ వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ పవిత్ర సందర్భంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఈసారి సాధారణం కంటే 30 శాతం అదనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గరుడసేవ రోజున 38 శాతం అదనంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. అలాగే స్వామివారి ప్రసాదాలను 30 శాతం, టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానీయాల పంపిణీని 50 శాతం మేర పెంచారు. తిరుమలకు వచ్చే భక్తుల రవాణా ఇబ్బందులు తొలగించేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను మరో 500 ట్రిప్పులు పెంచి, మొత్తం 3,100 ట్రిప్పులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

మంగళవారం(ఇవాళ) సాయంత్రం 6.21 గంటల నుండి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ శుభసమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

అనంతరం సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన 'పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్', ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్ తో పాటు భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

వైఖానస ఆగమశాస్త్రంలో అంకురార్పణకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. 'అంకురం' అంటే విత్తనం మొలకెత్తడం అని అర్థం. నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని సంకల్పించడమే ఈ ప్రధాన ఘట్టం యొక్క ఉద్దేశం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks