...
...
Next Story

రేపటి నుంచే సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు- 10, 12వ తరగతి విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి..

దేశవ్యాప్తంగా ఎగ్జామ్​ సీజన్​కు సమయం ఆసన్నమైంది. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు రేపు, ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో 10, 12వ తరగతి విద్యార్థులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి..

Published on: Feb 16, 2026, 10:46:15 IST
Advertisement
<p>సీబీఎస్‌ఈ సూచనల ప్రకారం.. పరీక్షలు<a href="https://www.hindustantimes.com/telugu/telangana/osmania-university-postpones-pg-first-semester-exams-following-student-protests-details-inside-261771026062694.html" target="_blank"> </a>ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకల్లా చేరుకోవాలి. 10:00 గంటలు దాటిన తర్వాత ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని సీబీఎస్​ఈ తేల్చి చెప్పింది.</p>

సీబీఎస్‌ఈ సూచనల ప్రకారం.. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకల్లా చేరుకోవాలి. 10:00 గంటలు దాటిన తర్వాత ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని సీబీఎస్​ఈ తేల్చి చెప్పింది.

"ఇండియా వ్యాప్తంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అత్యున్నత స్థాయి సమావేశాలు, ఇతర ఈవెంట్లు ఉంటాయి. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితులు, వాతావరణం, ట్రాఫిక్, దూరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇంటి నుంచి ముందే బయలుదేరడం ఉత్తమం," అని సీబీఎస్​ఈ సూచించింది.

పరీక్ష రోజున ఎలాంటి గందరగోళం ఉండకుండా, విద్యార్థులు- తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించడం ఉత్తమం అని సీబీఎస్​ఈ సూచించింది. ఫలితంగా రూట్​పై అవగాహన వస్తుందని పేర్కొంది.

ఈ ఏడాది నుంచి సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు రెండుసార్లు జరగనున్నాయి. మొదటిది అందరు కచ్చితంగా రాయాలి. రెండొవది ఆప్షనల్​. ఇక 12వ తరగతి పరీక్షల దిద్దుబాటులో ఓఎస్​ఎం (ఆన్​-స్క్రీన్​ మార్కింగ్​) పద్ధతిని సీబీఎస్​ఈ ప్రవేశపెట్టింది. అంటే టీచర్లు 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయనున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe