...
...
Next Story

Ind vs Afg ODI: జయహో జైస్వాల్.. సెంచరీతో చెలరేగిన కుర్రాడు.. రఫ్పాడించిన రోహిత్.. అఫ్గాన్ పై ఇండియా క్లీన్ స్వీప్

Ind vs Afg ODI: టీమిండియా అదరగొట్టింది. పసి కూన అఫ్గానిస్థాన్ ను కుమ్మేసింది. కుర్రాడు యశస్వి జైస్వాల్ సెంచరీతో.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అదిరే ఇన్నిగ్స్ తో చెలరేగారు. దీంతో మూడో వన్డేలోనూ విక్టరీ సాధించిన ఇండియా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

Published on: Jun 20, 2026, 20:23:12 IST
Advertisement
<p>టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ మరోసారి పేలాడు. అఫ్గానిస్థాన్ తో రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు. </p>

టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ మరోసారి పేలాడు. అఫ్గానిస్థాన్ తో రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు.

అఫ్గానిస్థాన్ తో మూడో వన్డేలో జైస్వాల్ శతకం బాదాడు. 86 బాల్స్ లో 110 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. జైస్వాల్ సెంచరీతో శనివారం (జూన్ 20) జరిగిన వన్డేలో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.

ఛేజింగ్ లో హిట్ మ్యాన్ కూడా సత్తాచాటాడు. ఈ సీనియర్ ఓపెనర్ 69 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఛేజింగ్ ను ఇండియా 28.4 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది.

అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ ను ప్రసిద్ధ్ కృష్ణ‌ హడలెత్తించాడు. ఈ ఇండియన్ పేసర్ 5 వికెట్లతో చెలరేగడంతో అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది.

అఫ్గానిస్థాన్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఫుల్ డామినెన్స్ చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe