...
...
Next Story

IND vs Pak : టీ20ల్లో పాకిస్థాన్​పై ఇండియాదే పైచేయి.. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది?

బాయ్​కాట్​లు, యూ-టర్న్​లు, గందరగోళం మధ్య 2026 టీ20 ప్రపంచకప్​లో ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ మ్యాచ్​కు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించిన స్టాట్స్​ని, వాతావరణ అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 15, 2026, 12:20:51 IST
Advertisement
<p>టీ20 ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు భారత్​ వర్సెస్​ పాకిస్థాన్​ మ్యాచ్​ ప్రారంభమవుతుంది. జియో హాట్​స్టార్​లో ఈ మ్యాచ్​ లైవ్​ని చూడవచ్చు.</p>

టీ20 ప్రపంచకప్​లో భాగంగా శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు భారత్​ వర్సెస్​ పాకిస్థాన్​ మ్యాచ్​ ప్రారంభమవుతుంది. జియో హాట్​స్టార్​లో ఈ మ్యాచ్​ లైవ్​ని చూడవచ్చు.

టీ20ల్లో పాకిస్థాన్​పై ఇండియాదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 16 మ్యాచులు జరగ్గా.. టీమిండియా 13సార్లు గెలిచింది. పాకిస్థాన్​ కేవలం 3సార్లే విజయం సాధించింది. ఇది మన జట్టుకు ఆత్మవిశ్వాశాన్ని పెంచే విషయం. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో ఇండియా మొదటి స్థానంలో, పాకిస్థాన్​ 6వ స్థానంలో ఉన్నాయి.

ఫ్యాన్స్​కి ఆందోళనకర విషయం ఏంటంటే.. ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ మ్యాచ్​కి వరుణుడి ముప్పు పొంచి ఉంది! కొలంబోలో ఉదయం భారీ వర్ష సూచన ఉంది. రాత్రి వేళ వర్ష ముప్పు కాస్త తగ్గుతున్నప్పటికీ, పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. ఈ మ్యాచ్​కి సంబంధించిన పూర్తి వెదర్​ అప్డేట్స్​ని ఇక్కడ క్లిక్​ చేసి తెలుసుకోండి.

ఈసారి ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ మ్యాచ్​లో భాగంగా 3 విషయాలపై క్రికెట్​ ఫ్యాన్స్​ ఆసక్తిగా ఉన్నారు. వాటిల్లో ఒకటి అభిషేక్​ శర్మ. గత మ్యాచ్​కి దూరమైన ఈ డాషింగ్​ ఓపెనర్​ పాక్​తో మ్యాచ్​ ఆడతాడో లేదో అని ఆందోళన ఉండేది. కానీ అభిషేక్​ శర్మ మ్యాచ్​ ఆడుతున్నట్టు సూర్యకుమార్​ యాదవ్​ ధ్రువీకరించాడు. ఇక రెండోది.. ఉస్మాన్​ తారిక్​. ఈ మిస్టరీ బౌలర్​ని టీమిండియా ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

ఇక మూడోది.. హ్యాండ్​షేక్​ వ్యవహారం! ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు స్పోర్ట్స్​ మీద కూడా పడ్డాయి. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత, గతేడాది జరిగిన ఆసియా కప్​లో పాక్​ ఆటగాళ్లకు హ్యాండ్​షేక్​ ఇచ్చేందుకు టీమిండియా నిరాకరించింది. అప్పట్లో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. “పాక్​ ఆటగాళ్లకు ఈసారి హ్యాండ్​షేక్​ ఇస్తారా?” అని అడిగినప్పుడు.. “అది తెలియాలంటే మ్యాచ్​ వరకు వేచి చూడాల్సిందే,” అని బదులిచ్చాడు టీమిండియా సారథి సూర్యకుమార్​ యాదవ్​.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe