...
...
Next Story

TG Indiramma Houses : హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్డేట్ - ఈనెల 27 నుంచి లాటరీ, ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

Telangana Indiramma Housing Scheme Updates : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఫ్లాట్ల కేటాయింపులకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 27 నుంచి 30 వరకు లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని హౌసింగ్ బోర్డు తెలిపింది.

Published on: Aug 20, 2026, 12:41:15 IST
Advertisement
<p>హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) క్యూర్‌ పరిధిలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం తీపి కబురుందించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు హౌసింగ్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. </p><p> </p>

హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) క్యూర్‌ పరిధిలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం తీపి కబురుందించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు హౌసింగ్ బోర్డు సర్వం సిద్ధం చేసింది.

లబ్ధిదారులకు పారదర్శకంగా ఫ్లాట్లను కేటాయించేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి లాటరీ (లక్కీ డిప్) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలంగాణ గృహనిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) వైస్ ఛైర్మన్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ డ్రా ప్రక్రియను ఏదో ఒక్క రోజుతో ముగించకుండా, ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించి 30వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం డిప్ ప్రక్రియ కొనసాగుతుంది.

"మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నిర్మిస్తున్న 7,340 ఇళ్లకు సంబంధించి దరఖాస్తుదారుల నుంచి భారీగా స్పందన వచ్చింది. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి తుది జాబితాను సిద్ధం చేశాం" అని గౌతమ్ పేర్కొన్నారు.

దరఖాస్తుదారుల సౌకర్యార్థం అర్హులైన వారి వివరాలతో కూడిన తుది జాబితాను గురువారం నుంచే అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. లబ్ధిదారులు ts.meeseva.telangana.gov.in, tghb.cgg.gov.in, tghb.telangana.gov.in పోర్టల్స్ ద్వారా తమ పేర్లను తనిఖీ చేసుకోవచ్చు:

జాబితాలో పేర్లకు సంబంధించి లేదా అర్హతలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తుదారులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోగా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలను పరిశీలించి, సవరించిన అనంతరం లాటరీ ప్రక్రియలో పాల్గొనే తుది దరఖాస్తుదారుల వివరాలను ఈ నెల 25న పూర్తిస్థాయిలో ప్రకటిస్తారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, వెబ్‌సైట్ వివరాలు లేదా లక్కీ డిప్‌కు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 040-24603572 ల్యాండ్‌లైన్ నంబర్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe