వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో(ఇవాళ, రేపు) తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
(image source @APSDMA)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 23వ తేదీన(రేపు) రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 23వ తేదీన(రేపు) రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి
ఈనెల 24వ తేదీన తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణతో పాటు ఏపీలో మళ్లీ పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండుతున్నాయి. ఫిబ్రవరి పూర్తి కాకముందే చాలా చోట్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే…వాతావరణంలో మరిన్ని మార్పులు ఉండొచ్చు.
(AFP File )
E-Paper

