...
...
Next Story

TG EAPCET 2026 Hall Ticket : ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు అలర్ట్ - రేపు హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్

TG EAPCET 2026 Hall Ticket Download : తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు (ఏప్రిల్ 27) విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధరులు సూచించారు.

Published on: Apr 26, 2026, 19:06:35 IST
Advertisement
<p>తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.<br> </p>

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోని 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేసి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ, సమయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి సరిదిద్దుకోవాలి. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును (Aadhar Card, etc.) వెంట తీసుకువెళ్లడం తప్పనిసరి.

ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరగనున్నాయి. మే మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు.

అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe