TG B Pharm Colleges Fees : ఫార్మసీ కాలేజీలకు ఫీజులు ఖరారు - అత్యధికంగా ఎక్కడంటే
రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ జీవో 10ని జారీ చేసింది. బీఫార్మసీ కోర్సుల్లో గత ఫీజులతో పోల్చితే 10 నుంచి 15 శాతం మేర పెరిగాయి.
ఇటీవలనే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసిన తెలంగాణ సర్కార్… తాజాగా ఫార్మసీ కాలేజీల ఫీజులను కూడా ఫైనల్ చేసింది. బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 10ని జారీ చేసింది. ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సర్కార్… ఈ జీవోను విడుదల చేసింది.

- రాష్ట్రంలో మొత్తం మొత్తం 120 బీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి.
- బీ ఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు ఫీజుగా నిర్ణయించారు.
- గతంలో కేవలం 3 కాలేజీల్లో మాత్రమే లక్ష రూపాయలకు పైగా ఫీజు ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 6కు చేరింది.
- రాష్ట్ర వ్యాప్తంగా 103 కాలేజీల్లో ఫీజు రూ.50 వేలు దాటింది.
- 17 కాలేజీల్లో మాత్రమే రూ.45వేల నుంచి రూ.49,500లోపు ఫీజులు ఉన్నాయి.
- గురునానక్ టెక్నికల్ క్యాంపస్ కు రూ. 1.21 లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత సీఎంఆర్ రూ. - 1.10 లక్షలు, విష్ణు ఇన్స్టిట్యూట్ రూ. 1,06,400గా ఉంది. ఇక సుల్తాన్ ఉలూమ్ రూ, 1,05,800, పుల్లారెడ్డి రూ. 1,02,600, రూ. గీతాంజలి - 1,00,800, ఎస్.ఎన్.వనితా మహావిద్యాలయకు రూ. లక్షగా నిర్ణయించారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 79 ఫార్మా డీ కాలేజీలు ఉన్నాయి. ఆయా కోర్సుల్లోని ఫీజులు చూస్తే… గీతాంజలి కాలేజీలో అత్యధికంగా రూ. 1,37,500గా నిర్ణయించారు. ఆ తర్వాత గురునానక్ రూ. 1,37,500, శ్రీదత్త కాలేజీ రూ. 1,26,500, శ్రీ ఇందులో రూ. 1.10 లక్షలుగా ఉంటుంది.
- రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు 8 ఉన్నాయి. వీటిలో అశోకా కాలేజీలో అత్యధికంగా రూ.1.32 లక్షల ఫీజు ఉంది.
మరోవైపు ప్రస్తుతం టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో కూడా ప్రవేశాలను కల్పిస్తారు. ఆయా కాలేజీల ఫీజుల విషయంలో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో… ఈసారి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసింది. ఫలితంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఫీజుల విషయంలో స్పష్టమైన అవగాహన వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











