...
...
Next Story

Krishna River : జూరాలకు భారీగా పెరుగుతున్న వరద -10 గేట్లు ఎత్తివేత, శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు

Krishna River Flood Updates : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.

Published on: Jul 30, 2026, 17:24:39 IST
Advertisement
<p>ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.</p>

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్‌లోకి 90,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో (వరద నీరు) వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ భద్రత మరియు నీటి నిల్వలను సమతుల్యం చేయడానికి అధికారులు అవుట్ ఫ్లో పెంచారు.

ఎత్తిన 10 గేట్ల ద్వారా 39,080 క్యూసెక్కుల నీటిని నేరుగా నదిలోకి వదులుతున్నారు. దీనికి అదనంగా, ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేస్తూ యూనిట్ల ద్వారా 38,272 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు.

గేట్ల ద్వారా మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా కలిపి మొత్తంగా ప్రాజెక్ట్ నుంచి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 77,352 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగి/// జూరాలకు వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగితే అధికారులు మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe