...
...
Next Story

దిష్టి తగలకుండా నివారించడానికి ఉపయోగించే 4 సాంప్రదాయ వస్తువులు!

హిందూమతంలోనే కాకుండా, ఇతర మతల్లోనూ దిష్టి గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. దిష్టిని తొలగించడంలో భారతీయులు శతబ్దాలుగా కొన్ని విషయాలను నమ్ముతారు. ఈ 4 విషయాలు దిష్టిని పోగొట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Published on: Jun 8, 2026, 20:32:57 IST
Advertisement

దిష్టి అనేది ఇటీవలి వచ్చిన విషయం కాదు. శతాబ్దాలుగా దీనిని ప్రజలు నమ్ముతున్నారు. జానపద సంప్రదాయాలు, నమ్మకాలు, కుటుంబ ఆచారాలలో దీనికి అర్థం ఉంది. భారతదేశంలో తమ పిల్లలకు నల్ల బొట్టు పెట్టడం నుండి టర్కీలోని ఇళ్లలో నీలిరంగు తాయెత్తులు వేలాడదీయడం వరకు, జనాలు నర దిష్టిపై విశ్వాసం కలిగి ఉన్నారు. దిష్టి గురించిన మూఢనమ్మకాలతో పాటు, ఇది సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

నిమ్మకాయ, పచ్చిమిర్చి

నజర్ దోషం నివారణ చిట్కాలు
నజర్ దోషం నివారణ చిట్కాలు

భారతదేశంలో దిష్టి తగలకుండా నివారించడానికి ఈ నిమ్మకాయ, పచ్చిమిరపకాయలను తరచుగా ఉపయోగిస్తారు. భారతదేశంలోని చాలా ఇళ్లలో, దుకాణాలలో, వాహనాలకు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడదీయడానికి ఒక నియమం కూడా ఉంది. దీని కోసం మీరు 7 తాజా పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలను ఉపయోగించాలి. సాంప్రదాయం ప్రకారం, నిమ్మకాయ పులుపు, మిరపకాయల కారం ప్రతికూల శక్తులను నాశనం చేస్తాయి.

తాయెత్తులు

ప్రజలు చెడు దృష్టిని నివారించడానికి కంటి తాయెత్తులను ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో పూసలతో చేసిన కంటి ఆకారపు తాయెత్తులను ధరిస్తే, మరికొన్ని ప్రాంతాలలో శక్తివంతమైన వేర్లతో చేసిన తాయెత్తులను ధరిస్తారు. టర్కీ, గ్రీస్‌లో ప్రజలు నీలం, తెలుపు, నలుపు రంగులలో కంటిని పోలిన ఏకకేంద్రక వృత్తాకార తాయెత్తులను ధరిస్తారు. కంటి తాయెత్తు బయటివారి చూపును నియంత్రించడంలో సహాయపడుతుందని అంటారు. కంటి చిహ్నం హానికరమైన చూపులను తిరిగి పంపినవారిపైనే ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో దీనిని తరచుగా నవజాత శిశువుల బట్టలకు గుచ్చుతారు, కార్లలో వేలాడదీస్తారు. అనేక ఇళ్లలో కూడా ఇంటిని అవాంఛిత శక్తి నుండి రక్షించడానికి ప్రవేశ ద్వారాల దగ్గర కంటి తాయెత్తులను వేలాడదీస్తారు.

నల్ల దారం

శతాబ్దాలుగా ఉప్పుకు శుద్ధీకరణతో సంబంధం ఉంది. అనేక భారతీయ గృహాలలో, పెద్దలు ఒక వ్యక్తి తల చుట్టూ గుప్పెడు ఉప్పును తిప్పి, ఆ తర్వాత దానిపై తూ.. తూ అని ఉమ్మి వేయమని విసిరివేయడం చూస్తునే ఉంటాం. కొందరు రాతి ఉప్పు గిన్నెలను గదుల మూలల్లో ఉంచుతారు, అది ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తుందని నమ్ముతారు. మరికొందరు భారమైన రోజుల తర్వాత శక్తివంతమైన శుద్ధి కోసం స్నానపు నీటిలో ఉప్పును కలుపుతారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు అతీతంగా కూడా, ఉప్పు శుద్ధీకరణకు, స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe