హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్టత ఉంది. ముఖ్యంగా అజా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈసారి అజా ఏకాదశి సోమవారం రావడంతో శివారాధనకు, చంద్ర పూజకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు ప్రతి సోమవారం శివునికి విశేష అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

చాలామంది శుక్ల పక్షం, కృష్ణ పక్ష ఏకాదశుల మధ్య తేడా చూపిస్తుంటారు. కానీ, ఏకాదశి విషయంలో ఎలాంటి భేదభావం చూపించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నెలలోని రెండు ఏకాదశి వ్రతాలను ఆచరిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కృష్ణ పక్ష ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
ఏకాదశి వ్రత నియమాలు
వ్రతం ఆచరించే వారు కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. దశమి నాటి నుంచే నిష్ట ప్రారంభమవుతుంది. దశమి రోజున ఒకేసారి భోజనం చేయాలి. ఉప్పు, అన్నం, కందిపప్పు, మినపప్పు, వంకాయ, తేనె వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం తీసుకోకూడదు.
ఏకాదశి రాత్రి జాగారం చేయడం ఉత్తమం. ఒకవేళ అది వీలుకాకపోతే కొంతసారైనా భగవన్నామ స్మరణ చేయాలి. రోజంతా కోపానికి దూరంగా ఉండి, నిద్రను తగ్గించి దైవ ధ్యానంలో గడపాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వంటి పనులు చేస్తే వ్రత ఫలం లభించదు. అలాగే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు, నీరు పోయకూడదు. తులసి కోటను దర్శించుకుని దీపారాధన చేయడం మంచిది.
వ్రత సంకల్పం మరియు పూజా విధానం
వ్రతం ప్రారంభించే ముందు చేతిలో గంగాజలం తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి. "ప్రభు మీ అనుగ్రహం కోసమే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను" అని మనసారా తలచుకోవాలి. మీ గోత్రనామాలను ఉచ్ఛరిస్తూ సంకల్పం చేయాలి. గంగాజలం చల్లుకుని పూజా కథను వినాలి. పూజా సమయంలో తులసి దళాలను శ్రీహరికి సమర్పించడం శ్రేయస్కరం.
వ్రత విరమణ సమయం
{{/usCountry}}వ్రతం ప్రారంభించే ముందు చేతిలో గంగాజలం తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి. "ప్రభు మీ అనుగ్రహం కోసమే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను" అని మనసారా తలచుకోవాలి. మీ గోత్రనామాలను ఉచ్ఛరిస్తూ సంకల్పం చేయాలి. గంగాజలం చల్లుకుని పూజా కథను వినాలి. పూజా సమయంలో తులసి దళాలను శ్రీహరికి సమర్పించడం శ్రేయస్కరం.
వ్రత విరమణ సమయం
{{/usCountry}}ఏకాదశి మరుసటి రోజు అనగా ద్వాదశి తిథి రోజున ఉదయం 6:02 నుండి 8:33 గంటల మధ్యలో వ్రతాన్ని విరమించవచ్చు. పారణ చేసే ముందు ఆవుకు పచ్చి గడ్డిని తినిపించి, బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ఆచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ప్రదోష వ్రతం కూడా వస్తోంది. ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రదోష రోజున అన్నం తీసుకోకుండా పూజ పూర్తి చేయాలి. శివునికి చందనం లేపనం సమర్పించి సాయంత్రం ప్రదోష వ్రత కథను వినాలి.