ప్రకృతి ఒడిలో వెలసిన స్వయంభూలింగం.. కఠినమైన కొండకోనలు దాటి భక్తి పారవశ్యంతో సాగే ప్రయాణం. ప్రతి ఏటా కోట్లాది మంది శివ భక్తులు తహతహలాడే అమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు కన్నుల పండుగగా మారనుంది.
57 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ

ఈ ఏడాది మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్ 15 నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో, భక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహను చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ, "హర హర మహాదేవ" నామస్మరణతో భక్తులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ బాబా దర్శనం కోసం తరలివస్తారు.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు లింగం
అమర్నాథ్ గుహలో నెలకొనే మంచు లింగం మానవ నిర్మితం కాదు, ఇది ప్రకృతి సిద్ధంగా మంచుతో ఏర్పడే అద్భుతం. ప్రతి ఏటా చంద్రుని కళలను బట్టి ఈ లింగం పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి నాటికి ఈ లింగం పూర్తి పరిమాణాన్ని సంతరించుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ అద్భుతాన్ని కళ్లారా చూడటం జన్మధన్యమని భక్తుల ప్రగాఢ నమ్మకం.
అమరనాథ్ నామకరణం వెనుక రహస్యం
పురాణాల ప్రకారం, ఈ గుహకు అమర్నాథ్ అని పేరు రావడానికి బలమైన కారణం ఉంది. ఒకసారి పార్వతీ దేవి పరమ శివుడిని అమరత్వానికి సంబంధించిన రహస్యాన్ని తెలియజేయమని కోరుతుంది. ఎవరైతే ఈ అమర కథను వింటారో, వారు మృత్యుంజయులు అవుతారని తెలిసిన పరమేశ్వరుడు, ఆ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న ఏకాంత ప్రదేశమే ఈ అమర్నాథ్ గుహ.
అమరత్వానికి సాక్షులుగా ఆ జంట!
శివుడు పార్వతికి కథ వినిపిస్తున్న సమయంలో, పొరపాటున అక్కడ ఉన్న ఒక పావురాల జంట కూడా ఆ అమరత్వ రహస్యాన్ని వింటుంది. కథ పూర్తయ్యాక శివుడు కళ్లు తెరిచి చూడగా, ఆ పావురాలు అక్కడ ఉండటం గమనిస్తాడు. తమకు రహస్యం తెలిసిందని అవి చెప్పడంతో, శివుడు వాటికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి ఆ పావురాల జంట ఆ గుహలోనే ఉండి, శివపార్వతుల ప్రతిరూపాలుగా భక్తులకు కనిపిస్తాయని ఒక నమ్మకం. అందుకే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది.
భక్తులకు సూచనలు
{{/usCountry}}శివుడు పార్వతికి కథ వినిపిస్తున్న సమయంలో, పొరపాటున అక్కడ ఉన్న ఒక పావురాల జంట కూడా ఆ అమరత్వ రహస్యాన్ని వింటుంది. కథ పూర్తయ్యాక శివుడు కళ్లు తెరిచి చూడగా, ఆ పావురాలు అక్కడ ఉండటం గమనిస్తాడు. తమకు రహస్యం తెలిసిందని అవి చెప్పడంతో, శివుడు వాటికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి ఆ పావురాల జంట ఆ గుహలోనే ఉండి, శివపార్వతుల ప్రతిరూపాలుగా భక్తులకు కనిపిస్తాయని ఒక నమ్మకం. అందుకే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది.
భక్తులకు సూచనలు
{{/usCountry}}హిమాలయాల్లోని వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. కాబట్టి యాత్రకు వెళ్లే భక్తులు శారీరకంగా, మానసిక సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని, అవసరమైన గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం.