ఆషాఢ అమావాస్య 2026: పితృ తర్పణాలు ఎలా చేయాలి? ఈ పరిహారాలతో పూర్వీకుల ఆశీస్సులు పొందండి!

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను పితృదేవతలను స్మరించుకునే విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు చేయడం ద్వారా పూర్వీకుల ఆశీసులు లభిస్తాయని నమ్మకం. పితృ తర్పణం ఎలా సమర్పించాలి, గోత్రనామాలను ఉచ్చరిస్తూ ఏ విధంగా నీటిని అర్ఘ్యంగా ఇవ్వాలి. 

Published on: Aug 10, 2026, 11:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య విశిష్టత, పితృ తర్పణాలు ఎలా సమర్పించాలి, పూర్వీకుల ఆశీసులు పొందేందుకు చేయాల్సిన ప్రత్యేక పరిహారాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆషాఢ అమావాస్య 2026: పితృ తర్పణాలు ఎలా చేయాలి? ఈ పరిహారాలతో పూర్వీకుల ఆశీస్సులు పొందండి!
ఆషాఢ అమావాస్య 2026: పితృ తర్పణాలు ఎలా చేయాలి? ఈ పరిహారాలతో పూర్వీకుల ఆశీస్సులు పొందండి!

హిందూ సాంప్రదాయంలో ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే అమావాస్యను 'హరియాలీ అమావాస్య'గా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాస కృష్ణ అమావాస్య తిథి ఆగస్టు 12వ తేదీ రాత్రి 01:52 నిమిషాలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 11:06 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 12నే అమావాస్య వ్రతం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆషాఢ అమావాస్య రోజున పితృ దేవతల నిమిత్తం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. కేవలం పితృ పూజ మాత్రమే కాకుండా, ఈ రోజున శివారాధన చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

పితృ తర్పణం ఆచరించే సరైన విధానం

ఈ అమావాస్య రోజున ఉదయమే సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని పూర్వీకులను మనసారా స్మరించుకోవాలి. ఇంటి దక్షిణ దిశ వైపు ముఖం పెట్టి, నీటిలో నల్ల నువ్వులు, గరిక, పూలు కలపాలి.

ఆ తర్వాత పితృ దేవతల గోత్రనామాలను ఉచ్ఛరిస్తూ శ్రద్ధగా తర్పణం వదలాలి. పెద్దల పేరిట సంపూర్ణ విధివిధానాలు పాటించడం కుదరని వారు, కేవలం భక్తితో మనసులో పూర్వీకులను తలచుకుని నమస్కరించుకుని నీటిని అర్ఘ్యంగా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల పితృ దేవతలు సంతృప్తి చెంది కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం.

అమావాస్య రోజున పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు

దానధర్మాలు: ఈ పవిత్ర రోజున పేదలకు శక్తి కొద్దీ అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది.

జీవాలకు సేవ: ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం పెట్టడం మన సంప్రదాయంలో భాగం. అమావాస్య రోజున మూగజీవాలకు గ్రాసం వేయడం ద్వారా పితృ దోషాల ప్రభావం తగ్గుతుంది.

రావి చెట్టు పూజ: పితృ దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున రావి చెట్టును పూజించి, దాని కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. అలాగే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More