ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే వాటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వీటిని అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. తంత్ర, మంత్ర సాధనలు, రహస్య ఉపాసనలకు ఈ నవరాత్రులు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

జూలై 15న ప్రారంభమైన గుప్త నవరాత్రులు జూలై 22, అంటే నేటితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల్లో పూజలు, వ్రతాలు చేయకపోయినా, ఈరోజు అంటే నవమి తిథి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.
గుప్త నవరాత్రుల్లో దశమహావిద్యలను ఆరాధిస్తారు. మాతంగి దేవిని పూజించడం ఆనవాయితీ. అలాగే ఈరోజు చాలా మంది హోమం, కన్యా పూజ వంటివి జరుపుతారు. ముఖ్యమైన పరిహారాలు ఇవే. మరి మీరు పాటిస్తున్నారా?
1.కన్యా పూజ:
నవమి నాడు కన్యా పూజ చేయడం చాలా మంచిది. హిందూ శాస్త్రాల ప్రకారం రెండు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు ఉండే బాలికలు దుర్గాదేవి స్వరూపులు. అందుకని తొమ్మిది మంది బాలికలకు సాత్విక భోజనం పెట్టి, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ బాలికలకు వస్త్రాలు, కానుకలు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
2.మాతంగి దేవి పూజ:
నవమి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై పరచి, మాతంగి దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పూలు, దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత "ఓం హ్రీం ఐం భగవత్యై మాతంగ్యై నమః" మంత్రాన్ని జపించాలి.
3.హోమం:
నవమి నాడు హోమం చేయడం చాలా మంచిది. ఆవు పిడకలు, గుగ్గులు, సాంబ్రాణి, హోమ ద్రవ్యాలతో పాటు లవంగాలు కూడా వేసి హోమాన్ని చేయాలి. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
4.మహాలక్ష్మి దేవి పూజ:
నవమి నాడు రాత్రి మహాలక్ష్మి దేవిని విధివిధానాలతో ఆరాధించాలి. దేవికి పాయసం నైవేద్యంగా పెట్టాలి. గులాబీ పూలు, తామర పూలను సమర్పించాలి. తామర గింజల మాలతో మహాలక్ష్మి మంత్రాలను జపిస్తే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
5.రత్నాలు ధరించండి:
{{/usCountry}}నవమి నాడు రాత్రి మహాలక్ష్మి దేవిని విధివిధానాలతో ఆరాధించాలి. దేవికి పాయసం నైవేద్యంగా పెట్టాలి. గులాబీ పూలు, తామర పూలను సమర్పించాలి. తామర గింజల మాలతో మహాలక్ష్మి మంత్రాలను జపిస్తే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
5.రత్నాలు ధరించండి:
{{/usCountry}}చాలా మంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుభవజ్ఞుడైన జ్యోతిష నిపుణుల సలహా మేరకు రత్నాలను ధరిస్తే సంబంధిత గ్రహం బలపడి శుభ ఫలితాలను చూడొచ్చు. కష్టాలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి.