జనాలకు భవిష్యత్తు గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే శతాబ్దాలుగా ప్రజలు జ్యోతిష్య శాస్త్రంపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్రవక్తలు చేసే అంచనాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. భవిష్యత్తు గురించి బాబా వంగా చేసిన అనేక జోస్యాలు నిజమై, ప్రజలను ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసినవి కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా భవిష్యవాణులను నమ్మే ప్రజలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అదే సమయంలో వాటిని కేవలం కల్పిత కథలుగా భావించేవారు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2026 నుండి 2030 సంవత్సరాల వరకు బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి ఇంట్రస్టింగ్గా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
2026: యుద్ధం
2026లో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద యుద్ధం చెలరేగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి చాలా సందర్భోచితంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచంపై ప్రభావం పడుతుంది.
2027: జీవసంబంధ మార్పులు, కొత్త వ్యాధుల
2027వ సంవత్సరం నాటికి ఒక కొత్త వ్యాధి లేదా జీవ ప్రయోగం వెలుగులోకి వస్తుందని, దాని ఫలితంగా కొంతమంది మానవులు మానవాతీత శక్తులను పొందవచ్చని బాబా వంగా చెప్పారు. ఈ ప్రవచనాన్ని పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. దీనిని 2026వ సంవత్సరానికి సంబంధించిన ప్రవచనాలతో ముడిపెట్టి కూడా చూడవచ్చు. రసాయన, జీవయుద్ధానికి కూడా సంబంధించినదని భావిస్తున్నారు.
2028: నూతన శక్తి
2028లో మానవులు ఒక కొత్త శక్తి వనరును కనుగొంటారని, ఆ శక్తి చాలా శక్తివంతమైనదిగా, స్వచ్ఛమైనదిగా ఉంటుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అలాగే శుక్ర గ్రహానికి ప్రయాణించే ప్రణాళికలు లేదా అంతరిక్షంలో కాలనీలను స్థాపించే ప్రణాళికలు ఈ సంవత్సరమే ప్రారంభం కావచ్చు.
2029: ఆర్థిక, సామాజిక విప్లవం
{{/usCountry}}2028లో మానవులు ఒక కొత్త శక్తి వనరును కనుగొంటారని, ఆ శక్తి చాలా శక్తివంతమైనదిగా, స్వచ్ఛమైనదిగా ఉంటుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అలాగే శుక్ర గ్రహానికి ప్రయాణించే ప్రణాళికలు లేదా అంతరిక్షంలో కాలనీలను స్థాపించే ప్రణాళికలు ఈ సంవత్సరమే ప్రారంభం కావచ్చు.
2029: ఆర్థిక, సామాజిక విప్లవం
{{/usCountry}}ఈ సంవత్సరం ప్రపంచంలోని చాలా దేశాలలో ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని మార్చే ఒక విప్లవం సంభవిస్తుంది. పాత వ్యవస్థలు కూలిపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. బాబా వంగా చెప్పిన ఈ భవిష్యత్ గత కొన్నేళ్లుగా వెలువడిన ఇతర అంచనాలకు సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
2030: దీర్ఘాయువు పెరగవచ్చు
బాబా వంగా అంచనాల ప్రకారం, 2030 నాటికి ప్రపంచం "హరిత శక్తి" వైపు పయనిస్తుంది. అంతేకాకుండా, కాలుష్యాన్ని తగ్గించడానికి సాంకేతికత బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల మానవ ఆరోగ్యం, దీర్ఘాయువు పెరగవచ్చు.