హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా అమావాస్య వస్తుంది. కానీ, చైత్ర మాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. 2026లో ఈ పర్వదినం మరిన్ని శుభ యోగాలతో రావడం వల్ల భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజున చేసే స్నాన, దాన ధర్మాలు పది రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
చైత్ర అమావాస్య 2026: తేదీ, సమయం

జ్యోతిష్య గణాంకాల ప్రకారం, 2026లో చైత్ర అమావాస్య తిథి ఏప్రిల్ 16, గురువారం రాత్రి 8:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17, శుక్రవారం సాయంత్రం 5:21 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, ఏప్రిల్ 17, శుక్రవారం రోజునే చైత్ర అమావాస్యగా పరిగణించి పూజలు, వ్రతాలు నిర్వహించాలి.
సర్వార్థ సిద్ధి.. అమృత సిద్ధి యోగాల కలయిక
ఈ ఏడాది చైత్ర అమావాస్య మరింత శక్తివంతంగా మారడానికి కారణం ఆ రోజు ఏర్పడుతున్న శుభ యోగాలే. ఏప్రిల్ 17న రోజంతా 'సర్వార్థ సిద్ధి యోగం' ఉంటుంది. ఈ యోగంలో ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం. దీనితో పాటు ఉదయం 6:29 గంటల నుండి మధ్యాహ్నం 12:02 గంటల వరకు 'అమృత సిద్ధి యోగం' కూడా తోడవనుంది. ఈ రెండు యోగాల కలయిక వల్ల పితృ తర్పణాలు ఇచ్చే వారికి, దాన ధర్మాలు చేసే వారికి అపారమైన పుణ్య ఫలం లభిస్తుంది.
పితృ దోషాల నుండి విముక్తి పొందే మార్గాలు
జాతకంలో పితృ దోషం ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు, సంతాన సమస్యలు లేదా అనారోగ్యం వెంటాడుతుంటాయి. వీటి నివారణకు అమావాస్య ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.
పవిత్ర స్నానం: ఈ రోజు సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేయడం ఉత్తమం. నదులకు వెళ్లే అవకాశం లేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి.
{{/usCountry}}పవిత్ర స్నానం: ఈ రోజు సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేయడం ఉత్తమం. నదులకు వెళ్లే అవకాశం లేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి.
{{/usCountry}}తర్పణం: నువ్వులు కలిపిన నీటిని పితృ దేవతలకు అర్పిస్తూ వారిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు తృప్తి చెంది వారసులకు సుఖశాంతులను ప్రసాదిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
రావి చెట్టు పూజ: హిందూ ధర్మంలో రావి చెట్టును దేవతా స్వరూపంగా భావిస్తారు. అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేయడం వల్ల పితృ దోష తీవ్రత తగ్గుతుంది.
చైత్ర మాస 'మహా దానం'
ఇది ఎండలు ముదిరే కాలం. అందుకే ఈ సమయంలో చేసే దానాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. "ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు," అని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున పేదలకు చల్లని నీరు నింపిన కుండలు (చలివేంద్రం ఏర్పాటు వంటివి), సత్తుపిండి, గొడుగులు లేదా కాలానుగుణంగా దొరికే పుచ్చకాయలు వంటి పండ్లను దానం చేయాలి.
ఈ పనులు చేయడం మర్చిపోవద్దు
జీవహింస చేయకుండా, మూగ జీవులకు ఆహారం అందించడం వల్ల కర్మ దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున పిండి ఉండలు చేసి చేపలకు వేయడం లేదా చీమలకు పంచదార కలిపిన పిండిని చల్లడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రోజున మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ విష్ణుమూర్తిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది.