జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి సందర్భం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మనం సాధారణంగా నేర్చుకోలేము అనుకునే చోట్ల నుంచి కూడా విలువైన పాఠాలను గ్రహించవచ్చని చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని 12వ అధ్యాయం, 18వ శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకం దాని అంతరార్థం ఇక్కడ చూద్దాం.
చాణక్య నీతిలో ముఖ్యమైన శ్లోకం

వినయం రాజపుత్రేభ్యః పండితేభ్యః సుభాషితమ్
అనృతం ద్యూతకారేభ్యః స్త్రీభ్యః శిక్షేత్ కైతవమ్
ఈ శ్లోకంలో చాణక్యుడు నాలుగు వేర్వేరు మూలాల నుండి నాలుగు రకాల గుణాలను నేర్చుకోవాలని సూచించారు.
1. రాజపుత్రుల నుంచి 'వినయం'
పెద్ద మనుషులు, రాజకుమారులు లేదా నాయకుల నుంచి మనం 'వినయం' నేర్చుకోవాలి. ఇక్కడ వినయం అంటే కేవలం నమస్కరించడం కాదు.. క్రమశిక్షణ, మృదువుగా మాట్లాడటం మరియు ఇతరులకు గౌరవం ఇవ్వడం. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వినయంగా ఉండేవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. నమ్రత కలిగిన వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు.
2. పండితుల నుంచి 'సుభాషితం' (మాట్లాడే తీరు)
ఏ సమయంలో ఏమి మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది పండితుల నుంచి నేర్చుకోవాలి. పండితులకు కేవలం జ్ఞానం మాత్రమే కాదు, వాక్శుద్ధి కూడా ఉంటుంది. ఎవరితో సరదాగా ఉండాలి, ఎవరిపై కోపం ప్రదర్శించాలి అనే విషయంలో వారికి స్పష్టత ఉంటుంది. వారి కోపం కూడా వృథాగా పోదు, అది ఒక ప్రయోజనం కోసమే ఉంటుంది. ఈ గుణాన్ని అలవర్చుకోవడం వల్ల మన మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది.
3. జూదగాళ్ల నుంచి 'సమయస్ఫూర్తి'
జూదగాళ్ల నుంచి అసత్యం చెప్పడం నేర్చుకోవాలని చాణక్యుడు అనడంలో ఒక గూఢార్థం ఉంది. ఇక్కడ అబద్ధం అంటే ఎవరినో మోసం చేయడం కాదు.. ఇది ఒక రకమైన 'డిప్లొమసీ' (కౌటిల్యం). అంటే ఒక పెద్ద నష్టాన్ని నివారించడానికి సమయానుకూలంగా మాటను ఎలా మార్చాలి లేదా నిజాన్ని ఎలా దాచాలి అనే ప్రాక్టికల్ తెలివితేటలను వారి నుంచి గ్రహించాలి. పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునే చాకచక్యం ఇది.
4. మహిళల నుంచి 'చాతుర్యం'
{{/usCountry}}జూదగాళ్ల నుంచి అసత్యం చెప్పడం నేర్చుకోవాలని చాణక్యుడు అనడంలో ఒక గూఢార్థం ఉంది. ఇక్కడ అబద్ధం అంటే ఎవరినో మోసం చేయడం కాదు.. ఇది ఒక రకమైన 'డిప్లొమసీ' (కౌటిల్యం). అంటే ఒక పెద్ద నష్టాన్ని నివారించడానికి సమయానుకూలంగా మాటను ఎలా మార్చాలి లేదా నిజాన్ని ఎలా దాచాలి అనే ప్రాక్టికల్ తెలివితేటలను వారి నుంచి గ్రహించాలి. పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకునే చాకచక్యం ఇది.
4. మహిళల నుంచి 'చాతుర్యం'
{{/usCountry}}చాణక్య నీతిలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఇది. మహిళల నుండి భావోద్వేగ మేధస్సు (Emotional Intelligence), అవగాహన మరియు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే కళను నేర్చుకోవాలి. మహిళలు సంబంధాలను కాపాడుకుంటూనే, ఎటువంటి ఘర్షణలు లేకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో తెలిసిన వారు. ఈ నేర్పు ప్రతి వ్యక్తికి అవసరం, ఎందుకంటే ఇది జీవితాన్ని సుఖమయం చేస్తుంది.
నేటి కాలంలో చాణక్యుడి బోధనల ప్రాముఖ్యత
వందల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు నేటి ఆధునిక ప్రపంచానికి కూడా సరిగ్గా సరిపోతాయి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు. వినయం, వాక్చాతుర్యం, ప్రాక్టికల్ తెలివితేటలు మరియు ఎమోషనల్ మేనేజ్మెంట్ ఉండాలి. ముఖ్యంగా మహిళల నుంచి నేర్చుకోవాల్సిన ఆ సూక్ష్మ దౌత్యం మనల్ని కుటుంబంలో మరియు సమాజంలో ఒక సమతుల్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.