...
...
Next Story

Chanakya: అలాంటి వ్యక్తికి పేదరికం ఎప్పటికీ రాదు.. చాణక్యుడి ఈ 4 సూత్రాలు పాటించండి!

ఆచార్య చాణక్యుడు జీవితంలో సుఖశాంతులు, విజయాలు సాధించడానికి నాలుగు ముఖ్యమైన సూత్రాలను సూచించారు. నిరంతర పరిశ్రమతో పనిచేసే వ్యక్తికి పేదరికం దరిచేరదని, కష్టపడి సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆర్థిక స్వతంత్రత సాధ్యమవుతుందని చెప్పారు.

Published on: Jun 19, 2026, 14:00:35 IST
Advertisement

ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం కేవలం ప్రాచీన కాలానికే పరిమితం కాదు. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి, అశాంతితో సతమతమవుతున్న వారికి ఈ సూత్రాలు దిశానిర్దేశం చేస్తాయి. పేదరికం, పాపాలు, గొడవలు, భయం వంటి సమస్యలను దూరం చేసుకుని ప్రశాంతమైన జీవనం గడపడానికి చాణక్యుడు చెప్పిన ఈ మార్గాలను తెలుసుకోండి.

నిరంతర పరిశ్రమతోనే ఆర్థిక స్వతంత్రత

quote of the day 19 June 2026 chanakya niti in hindi
quote of the day 19 June 2026 chanakya niti in hindi

"పరిశ్రమ ఉన్నచోట దరిద్య్రం ఉండదు," అని చాణక్యుడు స్పష్టం చేశారు. చాలా మంది తమ దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చుంటారు, కానీ కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తికి పేదరికం దరి చేరదు. నిరంతరం తన లక్ష్యం వైపు అడుగులు వేసే వ్యక్తికి విజయం దక్కుతుంది, తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి. కష్ట పడటం అంటే కేవలం పని చేయడం మాత్రమే కాదు, సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం. ఏ వ్యక్తి అయితే తన వృత్తిలో, వ్యాపారంలో అలసట లేకుండా శ్రమిస్తాడో, వారిని లక్ష్మీదేవి తప్పక వరిస్తుంది.

పాప పరిహారానికి దైవ చింతన

నిరంతరం దైవ నామస్మరణ లేదా జపం చేయడం వల్ల మనసు నిర్మలంగా మారుతుంది. తప్పులు చేయడం మానవ సహజం, కానీ నిరంతరం భక్తి మార్గంలో ఉన్నవారు ఆ పాప ప్రభావం నుండి బయట పడతారు. జపం అంటే కేవలం మంత్రాలు చదవడం మాత్రమే కాదు, మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోవడం. దీని వల్ల బుద్ధి వికసిస్తుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది, తద్వారా పాపం దరి చేరదు.

మౌనంతోనే కలహాలకు చెక్

చాలా గొడవలు అనవసరమైన మాటల వల్లే పుడతాయి. "మౌనంగా ఉన్నవాడికి కలహాలు ఉండవు," అన్నది చాణక్యుడి మరో అద్భుతమైన సూత్రం. సమాజంలో లేదా కుటుంబంలో ఏదైనా వివాదం జరిగినప్పుడు, వెంటనే స్పందించడం కంటే మౌనం వహించడం ఉత్తమమైన మార్గం. కోపంలో నోరు జారడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి, సమయం వచ్చినప్పుడు మాట్లాడటం తెలివైన లక్షణం.

అప్రమత్తతే నిజమైన రక్షణ

చాణక్యుడి ఈ నాలుగు సూత్రాలను విశ్లేషిస్తే, జీవితంలో క్రమశిక్షణే కీలకమని అర్థమవుతుంది. కష్టం, దైవభక్తి, సంయమనం, జాగరూకత - ఈ నాలుగు గుణాలు ఏ వ్యక్తిలో ఉంటాయో, వారిని ఏ సమస్య కూడా కుంగదీయలేదు. ఇవి కేవలం మాటలు కావు, ఆచరణలో పెట్టాల్సిన జీవన విధానాలు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe