పంచ మాంగల్యాలు అంటే ఏంటి, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? ఇక్కడ ఉన్న ఈ నాలుగు ప్రశ్నల సమాధానాలు తెలుసా?

మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం దాగి ఉంటుంది. స్త్రీల 16 అలంకారాలు, పుణ్య స్త్రీలు ఇంటికి వస్తే ఎందుకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు?, పంచ మాంగల్యాలు ఏంటి? పెళ్లయిన స్త్రీలు తప్పక ధరించాల్సినవి ఏవి?, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? 4 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

Published on: Feb 06, 2026 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం దాగి ఉంటుంది. మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? మరి ఓ లుక్ వేసేయండి. ఈరోజు చాలా మంది తెలుసుకోవాల్సిన 4 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

పంచ మాంగల్యాలు అంటే ఏంటి, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? (pinterest)
పంచ మాంగల్యాలు అంటే ఏంటి, శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు? (pinterest)

1.స్త్రీల 16 అలంకారాలు

స్త్రీల 16 అలంకారములు ఏవి అనే విషయం మీకు తెలుసా? ఈ పదహారు స్త్రీల అలంకారములు. దంతదావణం, నలుగు పెట్టుకుని స్నానం చేయడం, పసుపు రాసుకోవడం, చీర జాకెట్లు ధరించడం, పారాణి పెట్టుకోవడం, అందంగా జడ వేసుకోవడం, పుష్పాలంకరణ, నుదుట కుంకుమ ధరించడం, తిలకం పెట్టుకోవడం, గోరింటాకు, తాంబూలం వేసుకోవడం, కళ్లకు కాటుక పెట్టుకోవడం, మంగళసూత్రము, నల్లపూసలు, కాళ్లకు మెట్టెలు ఈ 16 కూడా స్త్రీల అలంకరణములుగా చెబుతారు. కనుక పెళ్లయిన స్త్రీలు కచ్చితంగా వీటిని ప్రతిరోజూ అనుసరించడం మంచిది.

2.పుణ్య స్త్రీలు ఇంటికి వస్తే ఎందుకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు?

చాలా మంది ఎవరైనా పుణ్యస్త్రీ ఇంటికి వస్తే వారికి మంగళకరమైన వస్తువులు ఇస్తారు. అసలు ఎందుకు అలా ఇస్తారు? దాని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.. ఇంటికి పుణ్యస్త్రీలు వచ్చినా, లేకపోతే శుభకార్యం జరిగినప్పుడు స్త్రీలకు మంగళకరమైన వస్తువులు ఇస్తారు. పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, జాకెట్ గుడ్డ వంటివి మంగళకరమైన వస్తువులు.

చాలా మందికి ఎందుకు ఇస్తారు అనే విషయం తెలియకపోయినా కూడా పెద్దలు చెప్పారని, తల్లో, అత్తయ్యనో చూసి పాటిస్తూ వుంటారు. ఇలా ఇది మన ఆచారం. పెద్దలు కూడా అలా ఇవ్వాలని చెప్తూ ఉంటారు. అవి స్వీకరించేటప్పుడు వారు ఆ ఇంటి ఇల్లాలిని ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదంతో ఆ ఇంటి ఇల్లాలికి సౌభాగ్యం కలుగుతుంది. అందుకనే ఇలా వస్తువులు ఇస్తారు.

పసుపు, కుంకుమ గౌరీదేవి స్వరూపాలు. వీటిని ఇచ్చి, పుచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. అలాగే మంగళకరమైన వస్తువులు ఇచ్చి, పుచ్చుకుంటే వారి మధ్య సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. అందుకే ఇలా ఇంటికి వచ్చినా, శుభకార్యాలు జరిగినా ఇస్తూ వుంటారు.

3.పంచ మాంగల్యాలు ఏంటి? పెళ్లయిన స్త్రీలు తప్పక ధరించాల్సినవి ఏవి?

పెళ్లయిన స్త్రీలు కచ్చితంగా పంచ మాంగల్యాలను ఎప్పుడూ ధరించాలి. నుదుట ఎర్రని కుంకుమతో పాటు మెడలో మంగళసూత్రం, చేతులకు మట్టి గాజులు, కాళ్లకు మెట్టెలు, జడలో పూలు. వీటినే పంచమాంగల్యాలు అంటారు. వీటిని ధరించకుండా భర్తకు భార్య కనపడకూడదని పెద్దలు చెబుతారు.

4.శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు?

శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం: రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, కాలింది, నాగ్నజితి, భద్ర, లక్షణ. ఈ ఎనిమిది మంది శ్రీకృష్ణుని పట్టమహిషులు.