ధన్వంతరి ఎవరు? ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోండి!
ధన త్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున పూజలు చేసినా, కొన్ని వస్తువులను కొనుగోలు చేసినా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు. దీపావళి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలి? ధన్వంతరి జన్మ కథ గురించి తెలుసుకుందాం.
మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి వస్తోంది. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదే విధంగా ప్రత్యేకించి ధన త్రయోదశి నాడు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున పూజలు చేసినా, కొన్ని వస్తువులను కొనుగోలు చేసినా సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి వారి ఇంట కొలువై ఉంటుందని నమ్ముతారు. ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఎందుకు ధన్వంతరిని ఆ రోజు పూజించాలి? అసలు ధన్వంతరి ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు ఆరాధించాలి?
ధన్వంతరి ఎవరు?
దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్నప్పుడు త్రయోదశి నాడు విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకుని కనపడతాడు. ఆ రోజున ధన్వంతరి పుట్టిన రోజు అని నమ్ముతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి జరుపుతారు, ప్రత్యేక పూజలు చేస్తారు.
ధన్వంతరి జన్మ కథ:
మనం పురాణాల ప్రకారం చూసినట్లయితే, రకరకాల కథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం చూసినట్లయితే, కాశీకి చెందిన ధన్వా అనే రాజు ప్రతి రోజూ భగవంతుడికి పూజలు చేసేవాడు. ధన్వంతరి అనే పుత్రుడు అతనికి పుడతాడని దేవతలు వరం ఇచ్చినట్లు బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. సాగర మథనంలో కనపడిన ధన్వంతరి ఆయన రెండవ జన్మ అని అంటారు.
ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి:
ధన్వంతరిని మనం చూసినట్లయితే, ఆయన నాలుగు చేతుల్లో కూడా జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకనే ఆయన్ని ఆయుర్వేద పితామహుడు అని అంటారు. ఆయన నుంచే చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడని అంటారు.
విష్ణు అవతారం ధన్వంతరి:
ధన్వంతరిని విష్ణు అవతారం అని అంటారు. కొన్ని రాష్ట్రాలలో ధన్వంతరి ఆలయాలు కూడా ఉన్నాయి. గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ఆలయాలు కనపడతాయి. అలాగే అమెరికా, జర్మనీ, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో కూడా ధన్వంతరిని ఆరాధిస్తారు.
ధన్వంతరి పూజా విధానం
ధన త్రయోదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత దీపారాధన చేసి విష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని పెట్టి గంధపుష్పాక్షతలతో పూజించాలి.
శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించాలి. ధన్వంతరి దేవుడిని ఈ విధంగా ఆరాధించడం వలన ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


