Vastu Tips : ఇంట్లోని ఈ 3 ప్రదేశాలలో పూజ గదిని నిర్మించవద్దు!
Vastu Tips : ఇంటికి ఈశాన్య దిశలో దేవుని గదిని నిర్మించడం ఉత్తమం. వాస్తు నియమాలను సరిగ్గా పాటిస్తూ దేవుడిని పూజిస్తే, ధనలక్ష్మి ఎల్లప్పుడూ ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి.
ప్రతి ఇంట్లోనూ పూజ గదికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో కొత్త ఇల్లు కట్టేటప్పుడు స్వామివారి గది వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని స్వామివారి గది సానుకూల శక్తికి, శాంతికి మూలం. దానిని సరైన దిశలో, సరైన ప్రదేశంలో నిర్మించినప్పుడు మాత్రమే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.

వాస్తు నియమాలకు విరుద్ధంగా దేవుడి గదిని నిర్మిస్తే, అది ఇంటికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తవచ్చని అంటుంటారు. వాస్తు నియమాల ప్రకారం, ఇంట్లోని ఈ 3 ప్రదేశాలలో దేవుడి గదిని నిర్మించకూడదు. ఆ ప్రదేశాలు ఏంటో చూడండి.
చాలా మంది స్థలాన్ని ఆదా చేసుకోవడానికి తమ ఇంట్లోని మెట్ల కింద దేవుడి గదిని నిర్మిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది ఒక పెద్ద పొరపాటు. మెట్ల కింద దేవుడి గదిని నిర్మించడం అశుభంగా పరిగణిస్తారు. ప్రజలు ప్రతిరోజూ మెట్లపై నడుస్తారు కాబట్టి, అది పరోక్షంగా దేవుని మీద నుంచి వెళ్లడం. ఇది ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. అటువంటి ప్రదేశంలో పూజలు చేయడం ఫలించదు. కుటుంబ ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.
పూజ గది అనేది సంపూర్ణ స్వచ్ఛత, పవిత్రత అవసరమయ్యే ప్రదేశం. అందువల్ల వాస్తు ప్రకారం ఏ కారణం చేతనైనా దేవుడి గదిని మరుగుదొడ్డికి లేదా స్నానాలగదికి పక్కన, ఎదురుగా, పైన లేదా కింద నిర్మించడం నిషిద్ధం. మరుగుదొడ్డి అనేది ప్రతికూల, చెడు శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశం. ఒకవేళ మరుగుదొడ్డి గోడ, పూజ గది గోడ ఒకటే అయితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక నష్టం ఉంటుంది. అది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
ఇంట్లోని పడకగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడం వాస్తు నియమాలకు పూర్తిగా విరుద్ధం. పడకగది అనేది కేవలం విశ్రాంతి, వ్యక్తిగత గోప్యత కోసం మాత్రమే కేటాయించిన ప్రదేశం. ఇక్కడ దేవుడి గది ఉంటే, దంపతుల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆ ఇంట్లో నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్లలో స్థలం తక్కువగా ఉండి.. పడకగదిలో దేవుడిని ఉంచాల్సిన అవసరం ఉంటే, దేవుడి విగ్రహాల కోసం ప్రత్యేకంగా చెక్క క్యాబినెట్ను ఉపయోగించాలి. పూజ పూర్తయిన తర్వాత కర్టెన్లను వేయాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


