నేరేడు పండ్లు విరగకాస్తే కరవు తప్పదా? ఎల్నినో ఎఫెక్ట్ వెనక నిజమిదేనా? సూసైడ్ ఫ్రూటింగ్!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు అతిగా కనిపిస్తున్నాయి. వర్షాలు పడవు అని ప్రకృతి ముందే సంకేతం ఇస్తుందా? నేరేడు పండ్లు ఎక్కువ కాస్తే ఏమవుతుంది? మన పెద్దలు ఏం చెప్పారు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నేరేడు పండ్ల దిగుబడి విపరీతంగా పెరిగింది. అయితే ఈ బంపర్ కాపు వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలను, రైతులను మాత్రం ఒక తెలియని భయం వెంటాడుతోంది.

'నేరేడు పండ్లు విరగకాస్తే.. ఆ ఏడాది భయంకరమైన కరవు వస్తుంది.' అనేది మన తాతలు, ముత్తాతల కాలం నాటి నమ్మకం. ఈ ఏడాది సరిగ్గా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఎల్నినో' (El Nino) ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమై, వర్షాలు మొహం చాటేస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ పాత నమ్మకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
సూసైడ్ ఫ్రూటింగ్
పెద్దలు చెప్పే ఈ నమ్మకం వెనక వృక్ష శాస్త్రంలో ఒక బలమైన తర్కం ఉంది. సైన్స్ ప్రకారం దీనిని 'మాస్టింగ్' (Masting) లేదా 'స్ట్రెస్ ఫ్రూటింగ్' (Stress Fruiting) అని పిలుస్తారు. కొన్నిసార్లు దీనిని 'సూసైడ్ ఫ్రూటింగ్' అని కూడా అంటారు. పర్యావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పుడు, భూగర్భ జలాలు పడిపోయినప్పుడు లేదా చెట్టు తీవ్రమైన నీటి ఒత్తిడికి గురైనప్పుడు.. తాను చనిపోతాననే భయంతో తన జాతి మనుగడను కాపాడుకోవడానికి చెట్లు ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో అవి కొత్త కొమ్మలు, ఆకులు వేయడం ఆపేసి, తమ వద్ద ఉన్న శక్తినంతా విత్తనాలు, పండ్ల ఉత్పత్తిపైనే కేంద్రీకరిస్తాయి. అంటే తన మనుగడను పట్టించుకోకుండా ఎక్కువ పండ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే దీనిని సూసైడ్ ఫ్రూటింగ్ అంటారు. భవిష్యత్తులో కఠినమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయనే ప్రకృతి సంకేతమే ఈ అధిక దిగుబడి. సో వర్షాలు తక్కువ పడుతాయని దీని అర్థం. అందుకే నేరేడు చెట్టు.. తన శక్తినంతా విత్తనాలు, పండ్ల కోసం ఉపయోగిస్తుంది.
ట్యాప్రూట్ సిస్టమ్
నేరేడు చెట్టు వేర్లు భూమిలోకి అత్యంత లోతుగా వెళ్తాయి. పైపొరల్లో నీరు లేకపోయినా ఇవి భూగర్భ జలాలను గ్రహించగలవు. అలాంటి నేరేడు చెట్లకు కూడా నీటి కొరత తెలిసిందంటే, భూగర్భ జలమట్టం భారీగా పడిపోయిందని అర్థం.
ఎల్నినో ప్రభావం నిజమేనా?
ఈ ఏడాది అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత వాతావరణ శాఖ కూడా దేశంపై ఎల్నినో తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రకటించింది. ఎల్నినో వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, కరవు పరిస్థితులు ఏర్పడడం సర్వసాధారణం. నేరేడు పండ్లు మార్కెట్లలో భారీగా అందుబాటులోకి రావడం, ఇటు ఎల్నినో కారణంగా వర్షాలు ముఖం చాటేయడం ఒకేసారి జరగడంతో పెద్దల మాట అక్షరాలా నిజమవుతోందని ప్రజలు భావిస్తున్నారు.
సైన్స్ ఏం చెబుతోంది?
అయితే నేరేడు పండ్లు ఎక్కువగా కాయడం అనేది రాబోయే కరవుకు ముందస్తు హెచ్చరిక మాత్రమే కాదని వృక్ష శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరేడు చెట్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూత పూస్తాయి. ఆ సమయంలో వాతావరణం పొడిగా, వేడిగా ఉంటే పరాగసంపర్కం బాగా జరిగి కాపు ఎక్కువగా వస్తుంది. ఒకవేళ ఆ సమయంలో అకాల వర్షాలు పడితే పూత రాలిపోతుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ బంపర్ క్రాప్ వచ్చిందంటున్నారు. కొన్ని చెట్లు కొన్నేళ్లకు ఒకసారి సహజంగానే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. దీనిని కేవలం కరవుతోనే ముడిపెట్టలేము.
పెద్దల మాటల్లోని నమ్మకానికి పూర్తిస్థాయి ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ, వాతావరణ మార్పుల పరంగా వారు చెప్పిన అనుభవ పాఠాలను మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే వాళ్లు ఎన్నో విషయాలను అంచనా వేసుకుని చెప్పి ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద నేరేడు పండ్లు చూస్తున్న చాలా మంది పెద్దల మాటలను గుర్తుచేసుకుంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


