...
...
Next Story

ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు గ్రహాల మార్పు - ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం..! వీటిలో తిరుగుండదు!

2026 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య జరిగే గ్రహాల మార్పుల వల్ల మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయి.ఈ సమయంలో ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు మరియు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

Published on: Jul 20, 2026 12:02 PM IST
Advertisement

రాబోయే 2026 సంవత్సరం ద్వితీయార్థం (రెండవ భాగం) చాలా మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అంచనాల ప్రకారం.. 2026 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య సంభవించే గ్రహాల మార్పులు కొన్ని రాశిచక్రాల వారికి అద్భుతమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఐదు నెలల కాలంలో కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి ఈ సమయం ప్రత్యేక ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

1. మిథున రాశి : నిలిచిన పనులు పూర్తి

  • సంవత్సరంలో చివరి ఐదు నెలలు మిథున రాశి వారికి పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయి.
  • చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి.
  • ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు… ఆశించిన ప్రదేశాల నుండి ప్రమోషన్లు లేదా మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, వ్యాపారం విస్తరిస్తుంది.
  • ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది…. అయితే చిక్కుకుపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది.

2. కన్యా రాశి : కష్టానికి తగిన ప్రతిఫలం

  • కన్యా రాశి వారికి ఈ కాలం కష్టపడి పనిచేయడానికి, దానికి తగిన ఫలితాలను అందుకోవడానికి సరైన సమయం.
  • మీరు ఎంతో కాలంగా శ్రమిస్తున్న పనిలో చివరకు శుభవార్త వింటారు.
  • ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు దక్కవచ్చు.
  • వ్యాపారంలో లాభాలు క్రమక్రమంగా పెరుగుతాయి.
  • కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం.

3. మకర రాశి : ఆదాయానికి కొత్త మార్గాలు

  • ఆగస్టు - డిసెంబర్ మధ్య కాలం మకర రాశి వారికి సరికొత్త అవకాశాల గని అని చెప్పవచ్చు.
  • కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి వారు కోరుకున్న కంపెనీల నుండి ఆఫర్లు లభిస్తాయి.
  • పని పరిధి పెరగడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
  • కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలం.
  • కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, సంతోషం వెల్లివిరుస్తుంది.

4. మీన రాశి : ఆర్థిక బలం.. బంధాల బంధుత్వం

  • 2026 చివరి ఐదు నెలలు మీన రాశి వారికి కెరీర్ పరంగా దూసుకుపోయే అవకాశాన్ని ఇస్తాయి.
  • కష్టానికి తగిన గుర్తింపు లభించి, ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి.
  • ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి.
  • కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి సమయం దొరుకుతుంది, బంధాల మధ్య ఆప్యాయత పెరుగుతుంది.

2026 ద్వితీయార్థంలో గ్రహాల మార్పు (Representative image)
2026 ద్వితీయార్థంలో గ్రహాల మార్పు (Representative image)
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe