12 సంవత్సరాల తర్వాత గురు-సూర్య సంయోగం.. 4 రాశుల వారికి జూలై నెలలో డబుల్ జాక్పాట్!
జూలై నెలలో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. జ్యోతిష్యపరంగా జూలై నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాల స్థానాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
సుమారు 12 సంవత్సరాల తర్వాత రెండు ముఖ్యమైన గ్రహాల సంయోగం జరగనుంది. సూర్యుడు-గురు గ్రహం కలిసి సంచరిస్తాయి. ఈ గ్రహ సంయోగం జూలై 16న కర్కాటక రాశిలో సంభవిస్తుంది. ఈ రెండు గ్రహాల సంయోగం సుమారు 1 నెల పాటు కొనసాగుతుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, హోదా, నాయకత్వం, గౌరవం, పరిపాలనా పనులకు కారకుడిగా పరిగణిస్తారు. గురువును అదృష్టం, విద్య, సంపద, జ్ఞానం, వివాహం, ఆనందం, శ్రేయస్సుకు కారకుడిగా పరిగణిస్తారు. 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో గురు-సూర్య సంయోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందో చూద్దాం.

మేష రాశి
మేష రాశి వారు 4వ ఇంట్లో గురు-సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారి ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల కలుగుతుంది. మీ వృత్తి, ఆర్థిక పరిస్థితిలో మీరు ఊహించని పురోగతిని చూడవచ్చు. అలాగే ఈ కాలంలో జీవితంలో ఆనందం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రభావవంతమైన వ్యక్తుల స్నేహం లభిస్తుంది. పనిలో ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొంతమందికి పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి 3వ ఇంట్లో గురు-సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వారికి గణనీయమైన ఆర్థిక లాభాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు ఊహించని మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో మంచి పురోగతి కనిపించవచ్చు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి ఉంటే, దాని ద్వారా మీకు డబుల్ జాక్పాట్ లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి మొదటి ఇంట్లో గురు-సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సంపద పెరుగుతుంది. వృత్తిలో ఉన్నతికి అవకాశాలు లభిస్తాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తుల ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. నగదు ప్రవాహం పెరుగుతుంది.
తులా రాశి
తులారాశి 10వ ఇంట్లో గురు-సూర్య సంయోగం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానం మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మంచి లాభాలు వస్తాయి. సమాజంలోని పలుకుబడి ఉన్న వ్యక్తుల స్నేహం మీకు లభిస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


