...
...
Next Story

Happy Akshaya Tritiya 2026 : మనసును తాకేలా మీ ప్రియమైనవారికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Happy Akshaya Tritiya 2026 : హిందూవులకు అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈరోజున చేసే పనులు శాశ్వత ప్రయోజనాలు ఇస్తాయని నమ్ముతారు. ఈ అక్షయ తృతీయకు మీ ప్రియమైనవారికి విషెస్ చెప్పండి.

Updated on: Apr 18, 2026, 13:47:33 IST
Advertisement

అక్షయ అనే పదానికి శాశ్వతమైన లేదా తరగని అని అర్థం. ఈ రోజున చేసే ఏ మతపరమైన ఆచారాలు లేదా దానధర్మాలు అయినా శాశ్వత ప్రయోజనాలను అందిస్తాయని నమ్ముతారు. హిందూమతంలో అక్షయ తృతీయకు అపారమైన ప్రాముఖ్యత ఉంది.

అక్షయ తృతీయ శుభాకాంక్షలు (Gemini)
అక్షయ తృతీయ శుభాకాంక్షలు (Gemini)

అక్షయ తృతీయను సాధారణంగా బంగారం కొనడం, దానాలు చేయడం లేదా కొత్త ప్రయాణాలు ప్రారంభించడం ద్వారా జరుపుకొంటారు. శాస్త్రాల ప్రకారం, అక్షయ తృతీయ రోజున విలువైన వస్తువులు కొనడం, ప్రార్థనలు చేయడం శ్రేయస్సు, సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున మీ ప్రియమైన వారికి పంపడానికి ఇక్కడ కొన్ని విషెస్ ఉన్నాయి.

  • "ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద |

శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః ||"

ఈ మంత్రం మీ ఇంట నిత్యం ప్రతిధ్వనించాలని, ఆ మహాలక్ష్మి కటాక్షంతో మీ సిరిసంపదలు అక్షయంగా పెరగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

  • "ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే |

ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||"

ధనపతి అయిన కుబేరుని ఆశీస్సులతో మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. అక్షయ తృతీయ శుభాకాంక్షలు!

  • "ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్ ||"

ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో శాంతిని, ఆరోగ్యాని అక్షయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ శుభకామనలు!

  • "మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః |

మంగళం పుండరీకాక్షః, మంగళాయ తనో హరిః ||"

ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ.. Happy Akshaya Tritiya 2026

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe