సాధారణంగా మనం హనుమంతుడికి ప్రత్యేకమైన వాహనం ఏదీ లేదని, ఆయనే వాయువేగంతో గాలిలో ప్రయాణిస్తాడని భావిస్తాం. కానీ కొన్ని పురాణ గాథలు, శిల్ప కళా ఆధారాల ప్రకారం హనుమంతుడి వాహనంగా ఒంటెను పేర్కొనడం వెనుక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి.
పురాణ నేపథ్యం

రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించినప్పుడు లేదా సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు తన సొంత శక్తితోనే ప్రయాణించాడు. అయితే ఉత్తర భారతదేశంలోని కొన్ని సంప్రదాయాల్లో, ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో హనుమంతుడిని ఒంటెపై కూర్చున్నట్లుగా చిత్రీకరిస్తారు.
పురాణాల ప్రకారం, హనుమంతుడు అజేయమైన శక్తివంతుడు. ఒంటె అనేది అత్యంత ఓర్పు, సహనం, కష్టపడే తత్వానికి ప్రతీక. ఎడారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా గమ్యాన్ని చేరే ఒంటెను, రామకార్యం కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్పుతో భరించే హనుమంతుడి గుణానికి సంకేతంగా భావిస్తారు. అందుకే దీనిని ఆయన వాహనంగా కొన్ని గ్రంథాల్లో అభివర్ణించారు.
దిక్కుతోచని ఎడారిలో సైతం మనిషికి సహాయపడే చివరి ఆశ్రయం ఒంటె. అలా జీవితంలో ఎలాంటి ఆధారం ఇక లేదు, ఎలాంటి ఆశ లేదనుకునే సమయంలో ఆంజనేయుడిని ప్రార్థిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని నమ్మకం.
ఆసక్తికర కథ
హనుమంతుడికి, ఒంటెకు మధ్య ఉన్న సంబంధం వెనక రామాయణ కాలానికి చెందిన ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. సాధారణంగా వాయువేగంతో ప్రయాణించే ఆంజనేయుడు, ఒకానొక సందర్భంలో ఒంటెను వాహనంగా ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో ఈ కథ వివరిస్తుంది.
రామాయణంలో వాలి అత్యంత బలశాలి. ఒకసారి వాలి దుందుభి అనే రాక్షసుడిని సంహరించి, అతని మృతదేహాన్ని గాలిలోకి విసిరేస్తాడు. అది వెళ్లి రుష్యమూక పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మాతంగ ముని ఆశ్రమంలో పడుతుంది. తన తపోవనాన్ని అపవిత్రం చేసినందుకు ఆగ్రహించిన మాతంగ మహర్షి, "వాలి ఎప్పుడైనా ఈ పర్వతంపై అడుగుపెడితే మరణిస్తాడు" అని శాపం విధిస్తారు.
{{/usCountry}}రామాయణంలో వాలి అత్యంత బలశాలి. ఒకసారి వాలి దుందుభి అనే రాక్షసుడిని సంహరించి, అతని మృతదేహాన్ని గాలిలోకి విసిరేస్తాడు. అది వెళ్లి రుష్యమూక పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మాతంగ ముని ఆశ్రమంలో పడుతుంది. తన తపోవనాన్ని అపవిత్రం చేసినందుకు ఆగ్రహించిన మాతంగ మహర్షి, "వాలి ఎప్పుడైనా ఈ పర్వతంపై అడుగుపెడితే మరణిస్తాడు" అని శాపం విధిస్తారు.
{{/usCountry}}తర్వాతి కాలంలో వాలికి, సుగ్రీవుడికి మధ్య వైరం ఏర్పడుతుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి, వాలి రాలేని ఏకైక ప్రాంతమైన రుష్యమూక పర్వతానికి వెళ్లి సుగ్రీవుడు తలదాచుకుంటాడు. హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రిగా, ప్రాణ స్నేహితుడిగా అక్కడే ఉండి అతనికి రక్షణగా నిలుస్తాడు.
ఒకానొక సందర్భంలో రుష్యమూక పర్వతంపై ఉన్న హనుమంతుడు అక్కడికి సమీపంలో ఉన్న సుందరమైన పంపా సరోవరాన్ని చూడాలని కోరుకుంటాడు. అయితే, సుగ్రీవుడు తన మిత్రుడి ప్రయాణం సుఖవంతంగా సాగాలని భావిస్తాడు. పర్వత ప్రాంతాలు, క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించడానికి అత్యంత అనువైన ఒంటెను హనుమంతుడి కోసం వాహనంగా సిద్ధం చేస్తాడు.
సుగ్రీవుడి కోరిక మేరకు, ఆ సమయంలో హనుమంతుడు ఆ ఒంటెపై కూర్చుని పంపా సరోవర ప్రాంతాన్ని సందర్శిస్తాడు. ఈ అరుదైన సందర్భం వల్లే కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని "ఉష్ట్ర వాహనారూఢుడు" (ఒంటె వాహనంపై ఉన్నవాడు) అని పిలుస్తారు. అయితే ఆంజనేయుడు శ్రీరాముడిని కలుసుకున్నది కూడా మొదట ఈ పంపాతీరంలోనే.
శిల్పకళా సాక్ష్యాలు
హనుమంతుడు ఒంటె వాహనంపై ఉన్నట్లు కేవలం కథల్లోనే కాకుండా చారిత్రక కట్టడాల్లోనూ కనిపిస్తుంది. కర్ణాటకలోని హంపిలో ఉన్న హజార రామ దేవాలయంలో హనుమంతుడు ఒంటెపై ఉన్న శిల్పాన్ని మనం చూడవచ్చు. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న ఐరావతేశ్వర ఆలయంలో కూడా ఒంటెపై ఉన్న హనుమంతుడి శిల్పం కనిపిస్తుంది.