...
...
Next Story

Rakhi Colour Zodiacs : మీ సోదరుడి రాశి ప్రకారం ఏ రంగు రాఖీ కట్టాలి?

Rakhi Colour Zodiacs : హిందూ మతంలో రక్షా బంధన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తోబుట్టువుల మధ్య ప్రేమ, బంధం, రక్షణ వాగ్దానానికి ప్రతీక అయిన ఈ పండుగను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున అత్యంత ఉత్సాహంగా జరుపుకొంటారు. అయితే మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలి?

Published on: Aug 26, 2026, 16:46:10 IST
Advertisement

ఈ సంవత్సరం రక్షా బంధన్ ఆగస్టు 28న వచ్చింది. ఇప్పటికే రకరకాల ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశికి, రంగులకు విడదీయరాని సంబంధం ఉంది. మీ సోదరుడి రాశికి తగిన రంగు, సరైన డిజైన్ ఉన్న రాఖీని ఎంచుకుని కట్టడం వారి భవిష్యత్తుకు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. మీ సోదరుడి రాశికి ఏ రంగు, ఏ డిజైన్ రాఖీ అత్యంత అనువైనదో చూడండి. రాఖీ రంగులు మాత్రమే కాకుండా దాని డిజైన్లు కూడా చాలా ముఖ్యమైనవి. రుద్రాక్ష, ఓం, స్వస్తిక్ డిజైన్లు ఉన్న రాఖీలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

మేషరాశి

ఏ కలర్ రాఖీ కట్టాలి?
ఏ కలర్ రాఖీ కట్టాలి?

ఈ రాశికి అధిపతి కుజుడు. అందువల్ల మేష రాశి సోదరుడికి ఎర్ర రంగు రాఖీ కట్టడం చాలా శుభప్రదం. ఇది వారి జీవితంలో ధైర్యం, బలం, ఉత్సాహాన్ని పెంచుతుంది.

వృషభ రాశి

ఈ రాశికి శుక్రుడు అధిపతి. వృషభ రాశి వారు తెలుపు, వెండి లేదా లేత నీలం రంగు రాఖీని కట్టుకోవడం శుభప్రదం. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది.

మిథునం

మిథున రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఈ రాశికి చెందిన సోదరుడికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టడం ఉత్తమం. ఇది తెలివితేటలు, శాంతి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

కర్కాటక

ఈ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి, కర్కాటక రాశి వారు తెల్లని లేదా ముత్యాలు పొదిగిన రాఖీని కట్టుకోవడం ఉత్తమం. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు పసుపు, నారింజ లేదా బంగారు రంగు రాఖీని కట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్యారాశి

ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి కన్యారాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది వృత్తిలో విజయాన్ని అందిస్తుంది.

తులారాశి

కుజ గ్రహం వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల వారికి ఎరుపు లేదా గులాబీ రంగు రాఖీ శుభప్రదం.

ధనుస్సు రాశి

గురు గ్రహ ప్రభావంతో జన్మించిన వారికి పసుపు లేదా చందనం రంగు రాఖీ కట్టడం శుభప్రదం. ఇది జ్ఞానం, అదృష్టం, విజయానికి మార్గం సుగమం చేస్తుంది.

మకర రాశి

మకర రాశికి శని అధిపతి. ఈ రాశిలో జన్మించిన వారు నీలి రంగు రాఖీ కట్టుకోవడం చాలా శుభప్రదం. ఇది పనిలో క్రమశిక్షణను కలుగజేస్తుంది.

కుంభరాశి

మకర రాశిలాగే కుంభ రాశికి కూడా శని అధిపతి. అందువల్ల ముదురు నీలం లేదా బూడిద రంగు రాఖీ కట్టడం వారికి అదృష్టాన్ని తెస్తుంది.

మీన రాశి

ఈ రాశికి గురు గ్రహం అధిపతి కాబట్టి, మీన రాశి సోదరుడికి పసుపు లేదా కుంకుమ రంగు రాఖీ కట్టడం చాలా శుభప్రదం.

గమనిక : ఇది నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఇంటర్నెట్‌‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఆర్టికల్ ఇచ్చాం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe