గురు అస్తమయం 2026 : ఆగస్టు 12 వరకు వివాహ ముహూర్తాలకు బ్రేక్ - రాశి ఫలితాలు ఇలా...!
కర్కాటక రాశిలో బృహస్పతి అస్తమించడంతో దేశవ్యాప్తంగా వివాహ ముహూర్తాలు నిలిచిపోనున్నాయి. మేషం నుంచి మీన రాశి వరకు ఈ గురు అస్తమయ ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే బృహస్పతి (గురుడు) త్వరలోనే అస్తమించనున్నాడు. 2026 జూలై 15వ తేదీ బుధవారం సాయంత్రం 07:59 గంటలకు కర్కాటక రాశిలో గురు గ్రహం అస్తమిస్తుంది. తిరిగి దాదాపు నెల రోజుల తర్వాత….. అంటే ఆగస్టు 12వ తేదీ ఉదయం 05:03 గంటలకు బృహస్పతి ఉదయించనున్నాడు. క

కర్కాటక రాశిలో జరిగే ఈ గురు అస్తమయ ప్రక్రియ జ్యోతిష్యపరంగా అత్యంత కీలకమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. దేవగురువు అస్తమించడంతో దేశవ్యాప్తంగా శుభకార్యాలకు, ముఖ్యంగా వివాహ ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. ఈ కాలంలో పెళ్లిళ్లు నిలిచిపోతాయి. తిరిగి నవంబర్ మాసంలోనే వివాహాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతి అస్తమయంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం……
మేషం నుంచి సింహ రాశి వరకు ఫలితాలు
- మేష రాశి : ఈ రాశి వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు నివాస స్థలం లేదా కార్యాలయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు సాగుతాయి.
- వృషభ రాశి : వృషభ రాశి జాతకులకు చిన్న మరియు సుదీర్ఘ ప్రయాణాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పనిప్రాంతం లేదా చేసే పని స్వభావంలో మార్పులు చోటుచేసుకుంటాయి.
- మిథున రాశి : ఆరోగ్యం కోసం, అలాగే ఇంటి మరమ్మత్తుల పేరుతో అధికంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో స్వల్ప అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. అయితే, మీ దినచర్యలో సానుకూల మార్పులు వస్తాయి.
- కర్కాటకం : మీ రాశిలోనే గురుడు అస్తమించడం వల్ల ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తొలగి వారు ప్రశాంతంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కానీ, మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కాస్త ఆందోళన కలిగిస్తాయి.
- సింహ రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం, పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. నివాసం లేదా పనిప్రాంతంలో మార్పులు ఉండవచ్చు. నిర్మాణ పనుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మొత్తంగా మిశ్రమ అనుభవాలు ఎదురవుతాయి.
కన్య రాశి నుండి మీన రాశి వరకు ఫలితాలు
- కన్యా రాశి : కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువుల పురోగతి పట్ల సంతోషిస్తారు. ఆధ్యాత్మిక, మతపరమైన పనుల్లో ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది.
- తులా రాశి : తులా రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పనిప్రాంతంలో కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్యం కోసం ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి లొకేషన్ మారే అవకాశం ఉంది.
- వృశ్చిక రాశి : సుదూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో మంచి, అశుభ సంఘటనలు రెండూ మిశ్రమంగా జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
- ధనస్సు రాశి : చిన్న, పెద్ద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు లేదా వివాదాస్పద కేసుల్లో పూర్తిస్థాయిలో కాకుండా సగం వరకు మాత్రమే విజయం లభిస్తుంది. ఆరోగ్యంలో అస్థిరత ఉంటుంది. తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం.
- మకర రాశి : కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే నిలిచిపోయిన కొన్ని పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ మాటల తీరు జాగ్రత్తగా లేకుంటే సంబంధాలు దెబ్బతినడమే కాకుండా సమాజంలో గౌరవం తగ్గే ప్రమాదం ఉంది. నూతన పరిచయాలు, కొత్త పనుల్లో నిమగ్నత పెరుగుతుంది.
- కుంభ రాశి : వివాదాల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువుల కొనుగోళ్లు ఉంటాయి. వాహన లేదా ఇంటి రిపేర్లు, ఆరోగ్యం, కోర్టు పనులపై ఖర్చులు పెరుగుతాయి. పాత సమస్య ఒకటి పరిష్కారమై ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. కానీ కొత్త బంధాలలో స్వల్ప ఉద్రిక్తతలు రావచ్చు.
- మీన రాశి : మీన రాశి వారు విషయాలను అంచనా వేయడంలో సగం మాత్రమే సఫలమవుతారు. ఆరోగ్యం, గృహ మరమ్మతులు, షాపింగ్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. మీ బంధుత్వాలు, సంబంధాలకు సంబంధించిన మంచి మరియు చెడు వార్తలను సమానంగా వినాల్సి వస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

