ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే మార్చి నెలలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో కనపడుతుంది కాబట్టి సూతక కాలాన్ని కూడా పరిగణించాలి. విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 3, మంగళవారం నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు, మంగళవారం పూర్వఫాల్గుణి నక్షత్రం, సింహరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వవాసు నామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది.

ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను కూడా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. అలాగే గ్రహణ సమయంలో రెండు సార్లు స్నానం చేస్తారు. గ్రహణం ప్రారంభం అయినప్పుడు పట్టు స్నానం, పూర్తయ్యాక విడుపు స్నానం చేస్తారు. మన దేశంలో చూసినట్లయితే, గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. కనుక దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహణం చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనబడుతుంది.
గ్రహణ ప్రారంభం, ముగింపు
గ్రహణం మార్చి 3 మధ్యాహ్నం 3:21కి ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభవుతుంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 6:48కి పూర్తిగా ముగుస్తుంది.
ఏ రాశి వారు చూడకూడదు?
సింహరాశిలో ఈ గ్రహణం సంచరించడం వలన సింహ రాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ ప్రభావం సింహ రాశి, కుంభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలను చూపిస్తుంది. మిగిలిన వారికి మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చెడు ఫలితాలు ఎదుర్కోబోతున్న ఈ రాశుల వారు గ్రహశాంతులు చేయించుకోవడం మంచిది. అలాగే జపాలు వంటివి మరుసటి రోజు చేయించుకుంటే గ్రహణ దోషాల నుంచి బయటపడవచ్చు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు:
గ్రహణ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ”, “శ్రీ రుద్రం” వంటి మంత్రాలను జపిస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయి.
{{/usCountry}}గ్రహణ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ”, “శ్రీ రుద్రం” వంటి మంత్రాలను జపిస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయి.
{{/usCountry}}గ్రహణానికి ముందు పట్టు స్నానం చేయాలి. గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో భగవంతుని స్మరించుకోవాలి.
గ్రహణ సమయం పుణ్యకాలం. కాబట్టి ఈ సమయంలో దానాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
ఈ సమయంలో గాయత్రి మంత్రం జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
చంద్రగ్రహణ సమయంలో గోదానం చేయడం కూడా మంచిది.
వెండి, బియ్యం వంటి దానాలు చేస్తే పుణ్యం కలుగుతుంది.
గ్రహణం పూర్తయ్యాక పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుళ్ల ఫోటోలు, విగ్రహాలను కడుక్కోవాలి. ఊరగాయలు మొదలైన నిల్వ పదార్థాలపై దర్భలను వెయ్యండి.
గ్రహణ సమయంలో కొన్ని శివాలయాలు ఎందుకు తెరిచి ఉంటాయి?
గ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ కొన్ని ఆలయాలు తెరిచి ఉంటాయి. ముఖ్యంగా అరుణాచలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలు తెరిచే ఉంటాయి. అది ఎందుకంటే అక్కడి శివలింగాలు స్వయంభువులు. స్వయంభువుగా వెలసినవి కావడంతో అవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయని నమ్మకం. అందుకే ఆ క్షేత్రాలను మూసివేయరు. గ్రహణ ప్రభావం నుంచి ఆ దైవశక్తి రక్షిస్తుందని విశ్వాసం.