...
...
Next Story

కుజ సంచారం 2026 : ఆగస్టు 2 నుంచి మిథునంలోకి అంగారకుడు - ఈ 4 రాశుల వారికి కష్టాలు!

ఆగస్టు 2న అంగారక గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించనుంది. శత్రు గ్రహమైన బుధుడి ఇంట కుజుడి సంచారం వల్ల సెప్టెంబర్ 18 వరకు ఏ ఏ రాశుల వారు హెచ్చరికతో ఉండాలో పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ఇక్కడ చదవండి…

Published on: Jul 28, 2026, 13:14:11 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పుల్లో అంగారకుడి (కుజుడు) గోచారం ఒకటి. ఆగస్టు నెల ప్రారంభంలోనే అంగారక గ్రహం తన స్థానాన్ని మార్చుకోనుంది. ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్న కుజుడు, 2026 ఆగస్టు 2వ తేదీ ఆదివారం నాడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం అంగారకుడు (శక్తి, దూకుడుకు కారకుడు), బుధుడు (మేధస్సు, సంభాషణకు కారకుడు) పరస్పరం శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు.

కుజ గోచారం 2026
కుజ గోచారం 2026

తన శత్రు గ్రహమైన బుధుడికి చెందిన మిథున రాశిలో అంగారకుడు ప్రవేశించడం వల్ల అనేక రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. కుజుడు ఈ మిథున రాశిలో సుమారు 46 రోజుల పాటు, అంటే 2026 సెప్టెంబర్ 18 వరకు సంచరిస్తాడు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం….. శక్తి స్వరూపుడైన అంగారకుడు బుధుడి ఇంట ప్రవేశించినప్పుడు మానసిక ఆందోళనలు, నిర్ణయాల్లో తొందరపాటు మరియు కోపం లేదా దూకుడు విపరీతంగా పెరుగుతాయి. ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ, 4 రాశుల వారు మాత్రం తీవ్ర జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆ నాలుగు రాశుల వివరాలు… వారు ఎదుర్కొనే సవాళ్లను ఇక్కడ తెలుసుకోండి…

1. కర్కాటక రాశి :

కుజ గోచారం కారణంగా కర్కాటక రాశి వారు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, కారణం లేని భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడవచ్చు. మనస్సులో ప్రతికూల ఆలోచనలు పెరిగి ప్రశాంతత లోపిస్తుంది. అదుపు తప్పే అనవసర ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి; చివరికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే ముందస్తుగా ఆర్థిక బడ్జెట్ రూపకల్పన చేసుకుని, అనవసర వ్యయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగంలో లేదా ఆఫీసు వాతావరణంలో ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకూడదు.

2. వృశ్చిక రాశి :

మిథునంలో కుజుడి ప్రవేశం మీన రాశి వారికి కూడా అంత సానుకూలంగా లేదు. ఈ కాలంలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో చిక్కులు ఎదురవుతాయి. మీ మాటతీరుపై ప్రత్యేక నియంత్రణ అవసరం, లేకుంటే మీ మాటలే ఇతరులను బాధపెట్టి మీపైకి తిరగబడవచ్చు. పనిచేసే చోట పైఅధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదించవద్దు. ఆ సమయానికి ఉపయోగకరంగా అనిపించినప్పటికీ, భవిష్యత్తులో పనికిరాని వస్తువుల కోసం డబ్బు వృధా చేసే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

4. మిథున రాశి :

స్వయంగా మీ రాశిలోనే కుజ సంచారం జరుగుతోంది. మిథునం కుజుడికి శత్రు క్షేత్రం కావడం వల్ల మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదం ఉంది. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేక అయోమయానికి గురవుతారు. కోపం విపరీతంగా పెరగడం, మాటపై అదుపు తప్పడం వంటి పరిణామాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా రక్తపోటు (బీపీ) పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe