సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 1 వరకు.. ఈ 4 రాశులకు బుధుడి అనుకూల ఫలితాలు!
4 రాశిచక్రాల సంకేతాల తరువాత6రోజుల తరువాత కిస్మత్: బుధుడు యొక్క కదలిక శుభకరంగా ఉంటే, ఒక వ్యక్తి యొక్క నిద్ర అదృష్టం కూడా మేల్కొంటుంది. కొన్ని రాశిచక్ర సంకేతాలు బుధ గ్రహం యొక్క ఈ కదలిక నుండి సానుకూల ఫలితాలను పొందుతాయి, అప్పుడు కొన్ని రాశిచక్ర సంకేతాలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
నవగ్రహాల్లో బుధ గ్రహానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రాకుమారుడిగా జ్యోతిష్య నిపుణులు అభివర్ణిస్తారు. ఈ గ్రహం తన గమనాన్ని మార్చుకునే తీరు ప్రతీ ఒక్కరి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. బుధుడి అనుగ్రహం ఉంటే నిద్రాణమైన అదృష్టం కూడా ఇట్టే మేల్కొంటుంది. ఒకవేళ జాతకంలో ఈ గ్రహస్థితి బలహీనంగా ఉంటే మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బుధుడి గోచారాలపై అందరిలోనూ ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.

ప్రస్తుతం చంద్రుడి ఆధిపత్యం ఉన్న హస్త నక్షత్రంలో సంచరిస్తున్న బుధుడు, త్వరలోనే తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 21, 2026 రోజున కుజుడి (అంగారకుడు) ఆధిపత్యం గల చిత్తా నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించనున్నారు.
ఈ అరుదైన నక్షత్ర మార్పు అక్టోబర్ 1వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ గోచార కాలం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయని ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ స్పష్టం చేస్తున్నారు.
బుధ నక్షత్ర సంచారంతో ఈ రాశులకు లాభాలు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా?
మిథున, సింహ రాశుల వారికి ఆర్థిక బలం
కుజుడి చిత్తా నక్షత్రంలోకి బుధుడు అడుగు పెట్టడం వల్ల మిథున రాశి జాతకులకు అన్ని విధాల కలసొస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన బకాయిలు లేదా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది.
దీని వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార రంగంలో నూతన అవకాశాలు లభించి విశేషమైన లాభాలు అర్జిస్తారు. అలాగే సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది. అదృష్టం తోడు నిలిచి చేపట్టిన ప్రతీ పనులోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చిక, మకర రాశుల వారికి శుభవార్తలు
చిత్తా నక్షత్ర గోచార ప్రభావంతో వృశ్చిక రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఊహించని శుభవార్తలు వినిపిస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇక మకర రాశి వారికి ఈ కాలం అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగి ఇళ్లలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


