మకర రాశిలోకి చంద్రుని సంచారం : జూలై 28 నుంచి ఈ 4 రాశులకు తిరుగులేని రాజయోగం - ఊహించని శుభ పరిణామాలు
జులై 28 సాయంత్రం, చంద్రుడు శని రాశి మకరంలో సంచరిస్తాడు. మేషం, కర్కాటక, మకరం మరియు మీనరాశి ఈ మార్పు యొక్క ప్రయోజనాన్ని పొందబోతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుని సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలోకెల్లా అత్యంత వేగంగా గమనాన్ని మార్చే చంద్రుడు, ఒక్కో రాశిలో కేవలం రెండున్నర రోజులు మాత్రమే నివాసం ఉంటాడు. జూలై 28వ తేదీ రాత్రి 8:45 గంటలకు చంద్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శనిదేవుడికి అధిపత్య రాశి అయిన మకరంలో చంద్రుని ఈ సంచారం రాబోయే మూడు రోజుల పాటు కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలను, నూతన అవకాశాలను తీసుకురానుంది.

నవగ్రహాల్లో చంద్రుడిని మనస్సుకు, మానసిక స్థిరత్వానికి, భావోద్వేగాలకు కారకుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న వారికి, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్న వారికి ఈ చంద్ర సంచారంతో తక్షణ ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల జాతకులకు ఈ కాలం బంగారు సమయంగా మారనుంది.
మేష రాశి :
చంద్రుని ఈ సంచారం మేష రాశి వారికి శుభవార్తలతో కూడిన మార్పులను తెస్తుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో నూతన బాధ్యతలు లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా, దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి :
కర్కాటక రాశికి స్వయంగా చంద్రుడే అధిపతి. జూలై 28 సాయంత్రం నుంచి ఈ రాశి వారికి ఉన్న మానసిక ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు తొలగిపోతాయి. చేతికి అందవలసిన మొండి బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు ఖాయమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కూడా మెరుగైన మార్పులు కనిపిస్తాయి.
మకర రాశి :
చంద్రుడు మకర రాశిలోనే సంచరిస్తుండటం వల్ల ఈ రాశి జాతకులకు ఆర్థిక అంశాల్లో అత్యంత శుభ సంకేతాలు అందుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సీనియర్లు, పైఅధికారుల నుంచి ప్రశంసలు దక్కడంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కీలకమైన ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది.
మీన రాశి :
చంద్ర సంచారం మీన రాశి వారి జీవితాల్లో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. మానసిక ప్రశాంతత పెరిగి, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కెరీర్లో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలం; పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది.
చంద్ర దోష నివారణకు పాటించాల్సిన పరిహారాలు:
చంద్రుని శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి మరియు ప్రతికూలతలు తొలగడానికి కొన్ని చిన్నపాటి నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
- రోజువారీ ప్రార్థనలో భాగంగా శివ పంచాక్షరి లేదా శివ మంత్రాలను జపించాలి.
- రాత్రి వేళ చంద్రునికి అర్ఘ్యం (నీరు) సమర్పించడం శ్రేయస్కరం.
- పేదలకు, అవసరార్థులకు బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లటి వస్తువులను దానం చేయాలి.
- ఇంట్లో మరియు సమాజంలో మహిళలను గౌరవించాలి.
- మానసిక ప్రశాంతత కోసం రోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం మంచిది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

