రాహు కేతు నక్షత్ర సంచారం 2026 : ఈ రాశుల వారికి సవాళ్లు - మిగతా రాశులపై ప్రభావం ఇలా
2026 ఆగస్టు 2న రాహువు ధనిష్ఠలోకి, కేతువు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
జ్యోతిష్యశాస్త్రంలో నీడ గ్రహాలుగా భావించే రాహువు, కేతువుల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ గ్రహాలు తమ రాశిని లేదా నక్షత్రాన్ని మార్చిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 2026 ఆగస్టు 2వ తేదీన రాహు, కేతువులు తమ నక్షత్రాలను మార్చుకోనున్నారు. రాహువు శతాభిష నక్షత్రం నుంచి నిష్క్రమించి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తుండగా, కేతువు మాఘ నక్షత్రాన్ని వీడి ఆశ్లేష నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు.

ప్రముఖ జ్యోతిష నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం…. ఈ నక్షత్ర మార్పు ముఖ్యంగా కర్కాటక, మకర రాశుల వారిపై అత్యధిక ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మిథున, ధనుస్సు, మీన రాశుల వారు కూడా రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయా రాశుల వారిపై పడే ప్రభావాలు ఇక్కడ చూడండి…
కర్కాటక రాశి :
ఈ నక్షత్ర మార్పు కాలంలో కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టే పనుల్లో అనవసర ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో అదనపు జాగ్రత్త అవసరం. ఎవరినీ గుడ్డిగా నమ్మక పోవడమే శ్రేయస్కరం.
మకర రాశి :
మకర రాశి వారికి కూడా ఈ సమయం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ముందస్తుగా బడ్జెట్ రూపకల్పన చేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. కోపతాపాలకు లోనై వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం.
మిథున రాశి :
మిథున రాశి వారు తమ సంభాషణ, ప్రవర్తనపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. పనిప్రాంతంలో సహోద్యోగులతో అనవసర ఘర్షణలకు తావివ్వకుండా సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. నూతన పెట్టుబడులు లేదా ఆర్థిక లావాదేవీలు జరిపే ముందు సమగ్రంగా విచారించిన తర్వాతే అడుగు ముందుకు వేయాలి.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారు ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు రెండింటి పట్లా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గతానికి సంబంధించిన పాత విషయాలు మళ్లీ గుర్తొచ్చి మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఓపికతో వ్యవహరిస్తే పరిస్థితులు మెల్లమెల్లగా సర్దుమణుగుతాయి.
మీన రాశి :
మీన రాశి వారు పిల్లల భవిష్యత్తు, ప్రేమ వ్యవహారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంతానం చదువు, కెరీర్ లేదా ఆరోగ్యం గురించిన ఆందోళనలు వెంటాడవచ్చు. భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఇలాంటి సమయంలో వివాదాలను పెంచుకోకుండా మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచిది. ఆవేశానికి, భావోద్వేగాలకు లోనై జీవితాన్ని ప్రభావితం చేసే పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు.
పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మేషం, వృషభం, సింహం, కన్య, తుల, వృశ్చికం మరియు కుంభ రాశుల వారికి ఈ నక్షత్ర మార్పు సాధారణ ఫలితాలను మాత్రమే ఇస్తుంది. అయినప్పటికీ…. ప్రధాన పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం లేదా చట్టపరమైన వివాదాల విషయంలో వివేకంతో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది.
రాహు -కేతువుల ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి పరమశివుడిని ఆరాధించడం శ్రేయస్కరం. ప్రతి సోమవారం, శనివారాల్లో శివలింగానికి జలాభిషేకం చేయాలి. పేదలకు, అవసరంలో ఉన్నవారికి తోచిన సహాయం అందించాలి. నిత్యం భక్తిశ్రద్ధలతో "ఓం రాం రాహవే నమః", "ఓం కేం కేతవే నమః" అనే మంత్రాలను జపించడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

