హనుమాన్ చాలీసా హనుమంతుడికి అంకితం చేయబడింది. నిజమైన హృదయంతో పఠిస్తే బజరంగబలి దయతో అనేక కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించినప్పటికీ, చాలా మంది ప్రతి మంగళవారం, శనివారం పఠిస్తారు. మంగళవారం హనుమంతుడికి, శనివారం న్యాయ దేవుడు శని దేవునికి అంకితం చేస్తారు. కానీ శనివారం ఎప్పుడు, ఎంత తరచుగా హనుమాన్ చాలీసా పఠించాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్న చాలా మంది భక్తుల మనస్సుల్లో ఉంది.

గ్రంథాలలో హనుమాన్ చాలీసా పఠించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. శనివారం హనుమాన్ చాలీసా పఠించడానికి నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
“జో సత బార్ పాఠ్ కర్ కోయీ,
ఛూటహి బంది మహా సుఖ్ హోయీ”
దీని అర్థం ఏమిటంటే.. శుద్ధమైన హృదయంతో, సంపూర్ణ భక్తితో ప్రతిరోజూ శ్రీ హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తే.. ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్న అన్ని రకాల భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతాడని అర్ధం. అలాగే హనుమాన్ చాలీసా పఠిస్తే మనసులో ఉన్న భయం, దుఃఖం, బాధలు, ఆందోళనలు, కర్మబంధాలు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. అంతే కాక ఆ వ్యక్తికి మానసిక శాంతి, ఆత్మసంతృప్తి, మహాసుఖం కలుగుతాయి. చివరిగా మోక్షప్రాప్తి కూడా సాధ్యమే. ఇలా ఇన్ని విధాలుగా ప్రయోజనాలు పొందవచ్చు కనుక ఎవరికైనా జీవితంలో కష్టాలు, అడ్డంకులు, భయాలు ఉంటే 100 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం చాలా శ్రేష్ఠమైనది.
హనుమాన్ చాలీసాను ఎన్ని సార్లు పఠించవచ్చు?
అన్ని సార్లు చేయలేకపోతే శనివారం హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించవచ్చు. ఏడు సార్లు పఠించడం కూడా ఉత్తమమైనది. అది కూడా కుదరకపోతే శనివారం ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి హనుమాన్ చాలీసా పఠించవచ్చు. దీంతో జీవితంలోని సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇది కూడా కుదరకపోతేరాత్రి 8 గంటలకు దీపం వెలిగించి, దాని ముందు కూర్చుని ప్రశాంతమైన మనస్సుతో హనుమాన్ చాలీసాను ఒక్కసారి పఠించండి. ఇలా 40 రోజులు నిరంతరం చేస్తే మంచిది. దీంతో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. హనుమంతుడు కూడా సమస్యల నుంచి కాపాడతాడు.
శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి
- శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని చెడు ప్రభావాలు తగ్గతాయని నమ్ముతారు.
- శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో పురోగతి సాధించవచ్చు.
- ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోవడం ప్రారంభమవుతుంది. సానుకూలత వ్యాపిస్తుంది.