నేటి బిజీ డిజిటల్ జీవితంలో శరీరంతో పాటు మనసు కూడా వేగంగా అలసిపోతోంది. ఏదో ఒక పాత సంఘటనను పదే పదే మననం చేసుకోవడం, ఇతరులు అన్న మాటలపై అనవసరంగా మదనపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం చాలామందిలో సాధారణమైపోయింది. సమస్య చాలా చిన్నదైనప్పటికీ, మనసు దానిని పదే పదే ఆలోచించి పెద్దదిగా మార్చేస్తుంది.

ఈ స్వభావమే క్రమంగా 'ఓవర్ థింకింగ్' (అతిగా ఆలోచించడం) అనే మానసిక సమస్యగా మారుతుంది. మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి మనోవేదనతోనే సతమతమయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించిన అమూల్యమైన గీతోపదేశం నేటి అశాంతి పూరిత మనసులకు కూడా చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. భగవద్గీత ప్రకారం మనసులో ఆలోచనలు రావడం సహజం, కానీ ప్రతీ ఆలోచననూ పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదని పెద్దలు చెబుతున్నారు.
మనసును ఓ సాధనంగా చూడండి, యజమానిగా కాదు
మనసు చాలా బలమైనది. దీనికి కనుక సరైన అజమాయిషీ లేకపోతే అది ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనలోకి మనల్ని లాకెళ్తుంది. ఎప్పుడో జరిగిన గతం మనల్ని బాధిస్తుంటుంది, లేదంటే రాబోయే రేపటి గురించిన భయం వెంటాడుతుంది. వీటన్నింటి మధ్యలో మన చేతుల్లో ఉన్న 'వర్తమానం' మాత్రం కరిగిపోతుంది. కాబట్టి, నిరంతర అభ్యాసంతో మనసును అదుపులో ఉంచుకోవచ్చని గీత చెబుతోంది. ప్రతి ఆలోచనను నిజమని నమ్మాల్సిన పనిలేదు. మనసును పనుల్లో నిమగ్నం చేయాలే తప్ప, దాని వెంటే మనమూ పరుగెత్తకూడదు.
ఆలోచనలతో నిరంతరం యుద్ధం చేయవద్దు
ఓవర్ థింకింగ్ బారిన పడిన మనిషి తన సొంత ఆలోచనలతోనే కుస్తీ పడుతుంటాడు. 'ఈ ఆలోచన నా మెదడులోకి ఎందుకు వచ్చింది? దీన్ని ఇప్పుడే ఎలా ఆపాలి?' అని సతమతమవుతుంటాడు. ఇలా ఆలోచనలను బలవంతంగా అణచివేయాలని చూస్తే ఆందోళన మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆ ఆలోచన స్వభావాన్ని గమనించాలి. ఇది మనకు ఏదైనా పరిష్కారాన్ని చూపుతుందా లేక పాత విషయాలనే మళ్లీ మళ్లీ తిప్పుతుందా అని బేరీజు వేసుకోవాలి. ఈ తేడాను గ్రహించడమే మనసును తేలికపరిచే మొదటి మెట్టు.
ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టండి
{{/usCountry}}ఓవర్ థింకింగ్ బారిన పడిన మనిషి తన సొంత ఆలోచనలతోనే కుస్తీ పడుతుంటాడు. 'ఈ ఆలోచన నా మెదడులోకి ఎందుకు వచ్చింది? దీన్ని ఇప్పుడే ఎలా ఆపాలి?' అని సతమతమవుతుంటాడు. ఇలా ఆలోచనలను బలవంతంగా అణచివేయాలని చూస్తే ఆందోళన మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆ ఆలోచన స్వభావాన్ని గమనించాలి. ఇది మనకు ఏదైనా పరిష్కారాన్ని చూపుతుందా లేక పాత విషయాలనే మళ్లీ మళ్లీ తిప్పుతుందా అని బేరీజు వేసుకోవాలి. ఈ తేడాను గ్రహించడమే మనసును తేలికపరిచే మొదటి మెట్టు.
ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టండి
{{/usCountry}}అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం భవిష్యత్తును పూర్తిగా మన నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ఆరాటమే. రేపు ఏం జరుగుతుంది? మనం తీసుకునే నిర్ణయం సరైనదేనా? నలుగురూ ఏమనుకుంటారు? అనే ప్రశ్నలు మనిషిని కృంగదీస్తాయి. గీతలోని కర్మయోగం ప్రకారం మీ చేతుల్లో ఉన్న కర్తవ్యాన్ని నిర్వర్తించండి. భవిష్యత్తు పూర్తిగా మన వశంలో ఉండదు, కానీ ఈ క్షణంలో వేసే తర్వాతి అడుగు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఫలితాన్ని మాత్రమే ఊహిస్తూ కూర్చుంటే ఏ పనీ ముందుకు సాగదు.
వర్తమానంలో బతకడం నేర్చుకోండి
అతిగా ఆలోచించడం వల్ల మనిషి రెండు చోట్లకు పరిగెడతాడు. ఒకటి గడచిపోయిన కాలం తాలూకు పశ్చాత్తాపం, మరొకటి భవిష్యత్తు గురించిన భయం. ఈ రెండూ కలిసి మనిషి వర్తమాన శాంతిని నాశనం చేస్తాయి. భగవద్గీత అందించే అతిపెద్ద గుణపాఠం ఇదే.. ఏ సమయంలో ఏ పని చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టండి. గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేము. రాబోయే కాలం కళ్ల ముందర ఇంకా రాలేదు. ఈ క్షణంలో చేయాల్సిన చిన్న మంచి పనే మనసును స్థిమితంగా ఉంచడానికి సహాయపడుతుంది.