అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన పవిత్ర పండుగ రక్షా బంధన్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ రోజున ఈ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండుగ తేదీ, పూజకు సరైన సమయం వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడంటే?

సనాతన ధర్మం ప్రకారం శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 09:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అనగా ఆగస్టు 28, 2026 శుక్రవారం ఉదయం 09:48 గంటలకు ముగుస్తుంది.
ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి ఈసారి ఆగస్టు 28న రక్షా బంధన్ను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్ర దినాన సోదరీమణులు నిర్ణీత వేళల్లో రాఖీ కట్టడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు
హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా సరైన ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి రెండు ప్రత్యేక ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి.
మొదటి ముహూర్తం: ఉదయం 05:57 నిమిషాల నుంచి ఉదయం 09:48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం.
రెండో ముహూర్తం: ఉదయం పూట కుదరని వారి కోసం మధ్యాహ్నం 01:52 నిమిషాల నుంచి సాయంత్రం 04:35 నిమిషాల వరకు మరో మంచి ముహూర్తం ఉంది.
భద్ర లేదా రాహుకాలం జాగ్రత్తలు
జ్యోతిష్య శాస్త్రంలో రాహుకాలం, భద్ర వంటి సమయాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా రాహుకాలంలో ఎలాంటి మంచి పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆగస్టు 28న ఉదయం 10:46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:22 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం వర్జ్యం. అయితే ఈసారి రక్షా బంధన్ రోజున భద్ర దోషం ఏమీ లేదు. కాబట్టి రాహుకాలం మినహా మిగిలిన సమయంలో ఎప్పుడైనా సోదరుడికి రాఖీ కట్టి దీవెనలు పొందవచ్చు.
అనుసరించాల్సిన పూజా విధానం, నియమాలు
పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారుచేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి, కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి.
{{/usCountry}}పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారుచేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి, కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి.
{{/usCountry}}రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి.
సోదరుడి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి.
అనంతరం సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీ కట్టి, మిఠాయి తినిపించి నోరు తీపి చేయాలి. సోదరుడు తన శక్తి కొద్దీ కానుకలు లేదా బహుమతులు అందించి సోదరికి ఆశీస్సులు ఇవ్వాలి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.