శ్రావణ మాసం 2026 : రాశుల వారిగా శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయాలి..? పూర్తి వివరాలు
పవిత్రమైన శ్రావణ మాసంలో రాశిచక్రాల ప్రకారం శివుడికి అభిషేకం చేస్తే ఫలితాలు కలుగుతాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
హిందూ విశ్వాసాల ప్రకారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర సమయం శ్రావణ మాసం. భోళాశంకరుడిని ఆరాధించడానికి, ఆయన కృపాకటాక్షాలు పొందడానికి ఈ మాసమును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక వేళ శివలింగానికి భక్తిశ్రద్ధలతో చేసే జలాభిషేకం, అర్చనల వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఆనందం, ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు.

అందుకే శ్రావణ మాసమంతా శివాలయాలు హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో, భక్తుల సందడితో నిండిపోతాయి. ఈ సమయంలో భక్తులు పరమేశ్వరునికి గంగాజలం, పాలు, పెరుగు, మారేడు దళాలు (బెల్ ఆకులు) వంటి పవిత్ర ద్రవ్యాలను సమర్పించి పూజిస్తారు.
జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం.. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తమ రాశిచక్రానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేక ద్రవ్యాలు, పూజా సామగ్రితో శివలింగానికి అభిషేకం లేదా అర్చన చేస్తే అనంతమైన శివానుగ్రహం కలుగుతుంది. ద్వాదశ రాశుల వారు తమ రాశిని బట్టి శివునికి ఎలాంటి పదార్థాలు సమర్పించాలో ఇక్కడ తెలుసుకోండి….
మేష రాశి:
మేష రాశికి చెందిన వారు శ్రావణ మాసంలో శాస్త్రోక్తంగా శివలింగానికి తేనె మరియు చక్కెర (దేశీ ఖండ్ లేదా స్వచ్ఛమైన పంచదార పొడి) సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయి.. నూతన ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
వృషభ రాశి :
వృషభ రాశి వారు ఈ పవిత్ర మాసంలో శివలింగానికి పాలు, పెరుగు లేదా స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. ఈ పరిహారం వల్ల వారి మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా… మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి :
మిథున రాశికి చెందిన జాతకులు శివలింగానికి మారేడు దళాలు, పచ్చి పాలు మరియు ఎర్రటి పువ్వులను సమర్పించడం ఎంతో శుభప్రదం. దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతిచెంది వారి మనోభీష్టాలను నెరవేరుస్తాడని ధార్మిక విశ్వాసం.
కర్కాటక రాశి :
చంద్రుని ఆధిపత్యం కలిగిన కర్కాటక రాశి వారు శివలింగానికి పాలు మరియు తెల్లటి రంగు కలిగిన పూజా సామగ్రిని మాత్రమే సమర్పించాలి. ఈ ఆరాధన వల్ల వారి మానసిక చంచలత్వం తగ్గి, మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.
సింహ రాశి :
సింహ రాశికి చెందిన వారు శ్రావణ మాసంలో శివలింగానికి తేనె మరియు బెల్లం సమర్పించాలి. ఇది వారికి అత్యంత శ్రేయస్సన్మిస్తుంది. ఈ పూజ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవ మర్యాదలు, నాయకత్వ గుణాలు విశేషంగా పెరుగుతాయి.
కన్యా రాశి :
కన్యారాశి వారు శ్రావణ మాసమంతా శివలింగానికి నిష్టతో మారేడు దళాలు మరియు తేనెను సమర్పించాలి. శివ ఆరాధనలో ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఎదురయ్యే ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి.
తులా రాశి :
తులా రాశి వారు శ్రావణ మాసంలో శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయాలి. దీనితో పాటు స్వచ్ఛమైన దేశీ నెయ్యిని కూడా సమర్పించవచ్చు. దీనివల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు వర్ధిల్లుతాయని నమ్ముతారు.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశికి చెందిన వారు పరమశివుని ఆరాధనలో ఎర్రటి పువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి. దాంతో పాటు శివలింగానికి పవిత్ర గంగాజలాన్ని సమర్పించాలి. ఈ నివారణ చర్య వల్ల వారికి సర్వకార్యాలలో విజయం, శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారు శ్రావణ మాసంలో శ్రీగంధం, పసుపు రంగు పువ్వులను మహదేవునికి సమర్పించాలి. ఇది జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను తొలగించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే (ఓవర్ థింకింగ్) సమస్య ఉన్నవారికి ఈ పరిహారం విశేష ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి :
మకర రాశి జాతకులు శ్రావణ మాసంలో శివలింగానికి పవిత్రమైన మారేడు పత్రాలు (బెల్ పత్రం), గంగాజలాన్ని సమర్పించాలి. ఈ రాశి వారికి శనీశ్వరుని దోషాలు తొలగి, పరమేశ్వరుని కటాక్షంతో ఆశించిన కార్యసిద్ధి లభిస్తుంది.
కుంభ రాశి :
కుంభ రాశికి చెందిన ప్రజలు శివలింగానికి పాల మీగడ మరియు కలకండ (పటిక బెల్లం) నివేదించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ మాసమంతా పూర్ణ హృదయంతో, భక్తిశ్రద్ధలతో ఈ పదార్థాలను సమర్పిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.
మీన రాశి :
మీన రాశి వారు శ్రావణ మాసంలో మహేశ్వరునికి తేనె, రేగు పండ్లను సమర్పించవచ్చు. శివుని పూజలో ఈ రెంటినీ చేర్చడం వల్ల సకల సంపదలు, కుటుంబంలో ప్రశాంతత సిద్ధపిస్తాయని మత విశ్వాసం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

