...
...
Next Story

సెప్టెంబర్ 7 అజ ఏకాదశి.. ధన లాభం, అప్పుల విముక్తి కోసం ఈ 8 శక్తివంతమైన పరిహారాలను పాటించండి!

అజ ఏకాదశి హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన వ్రతంగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగాలని కోరుకునేవారు రావి చెట్టు పూజ వంటి ఆచారాలను పాటిస్తారు.

Published on: Sep 6, 2026, 08:59:56 IST
Advertisement

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని 'అజ ఏకాదశి'గా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు జగత్ప్రభువు శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ ఏడాది సోమవారం రోజున అజా ఏకాదశి పర్వదినం రావడం విశేషం. హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 07:29 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 05:03 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా సెప్టెంబర్ 7న అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు.

సెప్టెంబర్ 7 అజ ఏకాదశి.. ధన లాభం, అప్పుల విముక్తి కోసం ఈ 8 శక్తివంతమైన పరిహారాలను పాటించండి! (AI)
సెప్టెంబర్ 7 అజ ఏకాదశి.. ధన లాభం, అప్పుల విముక్తి కోసం ఈ 8 శక్తివంతమైన పరిహారాలను పాటించండి! (AI)

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. సంపాదన ఉన్నప్పటికీ నిలకడ లేకపోవడం, అప్పుల బాధలు చుట్టుముట్టడం వంటి ఇబ్బందులు వేధిస్తుంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియడానికి అజా ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేయాలని ధర్మ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ధన లాభం, కష్టాల నివారణకు పాటించాల్సిన 8 ముఖ్యమైన పరిహారాలు

1.పేదలకు అన్నదానం:

ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. మీ జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోవాలంటే ఈ పవిత్ర రోజున పేదలకు లేదా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి.

2.శ్రీమద్భాగవత పఠనం:

అజ ఏకాదశి రోజు ఇంట్లో శ్రీమద్భాగవత కథను చదవడం లేదా వినడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని నింపుతుంది.

3.పంచామృత అభిషేకం:

విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి ఈ పూజ ఎంతో ఫలప్రదంగా ఉంటుందని విశ్వసిస్తారు.

4.బ్రహ్మ ముహూర్తంలో పూజ:

విష్ణు మంత్రాలను నిష్ఠగా జపించడం ద్వారా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయని చెబుతారు.

6.దంపతుల కలహాలకు పరిహారం:

వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతుంటే, ఈ రోజు తులసి మాతను పూజించాలి. లక్ష్మీదేవికి, తులసి మాతకు సౌభాగ్య సామగ్రిని సమర్పిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుందని నమ్ముతారు.

7.అరిటాకు పరిహారం:

ఒక అరటి ఆకుపై 'ఓం విష్ణవే నమః' అని రాసి విష్ణుమూర్తి పాదాల వద్ద సమర్పించాలి. మరుసటి రోజు ఆ ఆకును పసుపు రంగు బట్టలో చుట్టి మీ ఇంట్లోని బీరువాలో లేదా ధనం దాచే స్థలంలో ఉంచితే ఆర్థికాభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు.

8.రావి చెట్టు పూజ:

అజ ఏకాదశి రోజు రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇది ఇంట్లోని దారిద్య్రాన్ని తొలగిస్తుందని విశ్వసిస్తారు.

జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, భగవంతునిపై పరిపూర్ణ నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe