...
...
Next Story

సెప్టెంబర్ 8 భౌమ ప్రదోషం.. మూడు శుభయోగాల కలయిక, ఈ పూజ చేస్తే శివుడి అనుగ్రహం!

సెప్టెంబర్ 8, 2026న మంగళవారం వచ్చే భౌమ ప్రదోష వ్రతం శివభక్తులకు ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష కాలంలో పరమశివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగి, ధైర్యసాహసాలు పెరగడంతో పాటు రుణ, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Published on: Sep 6, 2026, 10:21:01 IST
Advertisement

హిందూ సనాతన ధర్మంలో ప్రదోష వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజున వచ్చే ప్రదోష వ్రతాన్ని 'భౌమ ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున జగత్ప్రభువు ఆ పరమశివుడిని ప్రదోష కాలంలో ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈసారి సెప్టెంబర్ 8న రానున్న భౌమ ప్రదోషం ఎన్నో అరుదైన యోగాల కలయికతో ఎంతో ప్రత్యేకం కానుంది.

భౌమ ప్రదోషం ముహూర్తం మరియు తిథి వివరాలు

సెప్టెంబర్ 8 భౌమ ప్రదోషం.. మూడు శుభయోగాల కలయిక, ఈ పూజ చేస్తే శివుడి అనుగ్రహం!
సెప్టెంబర్ 8 భౌమ ప్రదోషం.. మూడు శుభయోగాల కలయిక, ఈ పూజ చేస్తే శివుడి అనుగ్రహం!

పంచాంగం ప్రకారం, శ్రావణ కృష్ణ పక్ష త్రయోదశి తిథి సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 2:42 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. సూర్యాస్తమయ సమయానికి ప్రదోష కాలం వర్తించనుండటంతో సెప్టెంబర్ 8, 2026 (మంగళవారం) నాడే ఈ వ్రతాన్ని ఆచరించనున్నారు. మంగళవారం కుజ గ్రహానికి సంబంధించిన రోజు కావడంతో, ఈ ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల ధైర్యసాహసాలు ఇనుమడించడంతో పాటు రుణాలు, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పూజకు లభించే అద్భుతమైన సమయం

శివారాధనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోష కాలంలో భక్తులకు సుమారు రెండు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు అత్యంత శుభప్రదమైన సమయం దక్కుతుంది.

పూజా సమయం: సెప్టెంబర్ 8న సాయంత్రం 6:35 గంటల నుంచి రాత్రి 8:52 గంటల వరకు.

ఈ నిర్ణీత సమయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేసి బిల్వపత్రాలు, పూలతో పూజించాలి. అలాగే ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:31 నుండి 5:17 గంటల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 గంటల వరకు ఉంటుంది.

మూడు విశేష యోగాల కలయిక

ప్రదోష రోజున సూర్యాస్తమయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత శివాలసయానికి వెళ్లి లేదా ఇంట్లోనే ఈశాన్య మూలన శివలింగానికి జలాభిషేకం చేయాలి.

ఆ పై పాలు, బిల్వపత్రాలు, ధతూరా, తెల్లని పూలు, అక్షతలు సమర్పించాలి.

ఆవు నెయ్యితో దీపం వెలిగించి 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా జపించాలి.

తెల్లని మిఠాయిలను లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పూజను ముగించాలి. ఈ రోజు కోపానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe