...
...
Next Story

ఆగస్టు 1 వరకు శుక్ర - కేతువుల కలయిక - ప్రేమ, ఆరోగ్యం, వైవాహిక జీవితంపై చూపే ప్రభావం ఇలా

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు 1 వరకు శుక్రుడు, కేతువు ఒకే రాశిలో కలిసి ఉండనున్నాయి. ఈ గ్రహాల కలయికతో ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు.

Published on: Jul 10, 2026, 21:52:34 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలలో శుక్రుడిని ప్రేమ, వివాహం, శారీరక సౌకర్యాలు, బంధాలకు కారకుడిగా పరిగణిస్తారు. మరోవైపు కేతువును ఆకస్మిక మార్పులు, విరక్తి, గందరగోళాన్ని సృష్టించే గ్రహంగా చూస్తారు.

ఆగస్టు 1 వరకు శుక్ర-కేతువుల కలయిక
ఆగస్టు 1 వరకు శుక్ర-కేతువుల కలయిక

ప్రస్తుతం ఈ రెండు కీలక గ్రహాలైన శుక్రుడు, కేతువు కలిసి ఒకే స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంయోగం ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ కలయిక అంతగా కలిసివచ్చే సూచనలు కనిపించడం లేదని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం…. శుక్ర - కేతువుల కలయికతో భార్యాభర్తల మధ్య బంధంలో అనవసర ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరగవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు దొర్లే ప్రమాదం ఉంది. ఒకవేళ దంపతుల మధ్య ఇప్పటికే ఏవైనా మనస్పర్థలు ఉంటే, వాటిని మరింత పెంచుకోకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో కోపంలో, ఆవేశంలో తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు….

శుక్రుడు ప్రేమను అందిస్తే, కేతువు దూరాన్ని పెంచుతాడు. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ప్రేమ బంధాలలో అపార్థాలు, అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. కొందరి బంధాలు బలహీనపడటంతో పాటు భాగస్వాముల మధ్య దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భాగస్వామితో ఎలాంటి దాపరికం లేకుండా, బహిరంగంగా మనసు విప్పి మాట్లాడటం ఎంతో అవసరం.

మహిళల ఆరోగ్యంపై ప్రభావం…

ఈ గ్రహాల సంచారం మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. కొంతమంది మహిళలు హార్మోన్ల సమతుల్యత లోపించడం లేదా గైనకాలజికల్ (స్త్రీ జననేంద్రియ) సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. గతంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చిన్న ఇబ్బంది కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

జ్యోతిషశాస్త్ర నియమాల ప్రకారం, ఏ గ్రహం యొక్క ప్రభావమైనా అందరిపై ఒకేలా ఉండదు. ఇది ఆయా వ్యక్తుల జన్మ జాతకం, అందులోని గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒకరి జాతకంలో శుభ గ్రహాలు బలంగా ఉంటే, ఈ శుక్ర-కేతువుల ప్రతికూల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.

ఆగస్టు 1 వరకు వ్యక్తిగత బంధాలు, కుటుంబ విషయాలలో ప్రతి ఒక్కరూ ఎంతో ఓపికగా, నిదానంగా వ్యవహరించాలని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ సూచించారు. అనవసరమైన వాదనలకు, గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు గందరగోళానికి గురికాకుండా తెలివిగా ఆలోచించాలి. ఈ సమయంలో దైవారాధన చేయడం, సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe